Begin typing your search above and press return to search.

పరువు తీశారంటూ సోషల్‌ మీడియాలో చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

By:  Tupaki Desk   |   25 March 2021 4:28 AM GMT
పరువు తీశారంటూ సోషల్‌ మీడియాలో చరణ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం
X
మరో రెండు రోజుల్లో మెగా ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న చరణ్ బర్త్‌ డే రాబోతుంది. ఇప్పటికే రామ్‌ చరణ్‌ బర్త్‌ డే వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న బర్త్‌ డే వేడుకలు ఎల్లుండితో ముగియబోతున్నాయి. ఇక బర్త్ డే రోజు జరుపబోతున్న వేడుకల కోసం అభిమానులు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా ట్రెండ్డింగ్‌ కు సిద్దం అవుతున్నారు. మాంచి జోరు మీద ఉన్న అభిమానులకు నిరుత్సాహం కలిగేలా చరణ్‌ బర్త్‌ డే కామన్‌ డీపీ ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట తమ పరువు తీసే విధంగా చరణ్‌ బర్త్‌ డే కామన్‌ డీపీని డిజైన్‌ చేశారంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ బర్త్‌ డే కామన్‌ డీపీని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ విడుదల చేసింది. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ తో పాటు ప్రముఖులు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఈ కామన్‌ డీపీని షేర్‌ చేశారు. అభిమానులు కామన్‌ డీపీ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ చరణ్‌ ఫొటో పెట్టడంతో పాటు అది కూడా పాతది పెట్టారంటూ విమర్శలు చేస్తున్నారు. అది ఒక స్టార్‌ హీరో కామన్ డీపీ మాదిరిగా లేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు చేసే పోస్టర్స్‌ అంతకు మించి చక్కగా అద్బుతంగా ఉంటాయి. అలాంటిది మీరు ఎలా ఈ కామన్‌ డీపీని విడుదల చేశారంటూ నెట్టింట కొందరు మెగా అభిమానులు తీవ్ర అసహనంతో ఊగిపోతున్నారు. ఈమద్య కాలంలో హీరోల బర్త్‌ డే సందర్బంగా కామన్‌ డీపీలు చాలా ప్రముఖంగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. కాని చరణ్‌ ఈసారి కామన్ డీపీ మాత్రం పెద్దగా సందడి చేయడం లేదు.