Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికి రష్మిక పోటీ అవ్వగలదా?

By:  Tupaki Desk   |   20 May 2020 6:50 AM GMT
ఆ ఇద్దరికి రష్మిక పోటీ అవ్వగలదా?
X
టాలీవుడ్‌ లో కొత్త స్టార్‌ హీరోయిన్స్‌ శకం మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కీర్తి సురేష్‌.. సాయి పల్లవి.. రష్మిక మందన్నా.. పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. కమర్షియల్‌ సినిమాలకు.. కమర్షియల్‌ హీరోలకు పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఆమె ఎంత కాలం పాటు తెలుగులో రాణిస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇక మిగిలిన ముగ్గురు మాత్రం టాప్‌ ప్లేస్‌ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.

కమర్షియల్‌ పాత్రలతో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కంటిన్యూగా చేస్తూ కీర్తి సురేష్‌ చాలా బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా తమిళంలో ఈమె పలు చిత్రాల్లో నటిస్తుంది. ఇక సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో లవ్‌ స్టోరీ మరియు విరాటపర్వం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈమె ఓకే అంటే ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉంటాయి. కాని ఆచితూచి మరీ సినిమాలకు కమిట్‌ అవుతుంది. ఇదే సమయంలో ఈమె తమిళంలో కూడా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది.

సాయి పల్లవి.. కీర్తి సురేష్‌ లతో పాటు రష్మిక మందన్నా కూడా తెలుగులో బిజీగా ఉంది. కాని ఈమె కేవలం కమర్షియల్‌ పాత్రలకే పరిమితం అవుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో రష్మిక కాస్త నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయాలని ఆశ పడుతుంది. రెండు విధాలుగా నటించినప్పుడు మాత్రమే స్టార్‌ హీరోయిన్‌ గా ఎక్కువ కాలం కెరీర్‌ ను నెట్టుకు రాగలరు. మరి రష్మిక సాయి పల్లవి.. కీర్తి సురేష్‌ ల పోటీకి తట్టుకుని రష్మిక నిలిచేనా అనేది కాస్త అనుమానమే అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.