Begin typing your search above and press return to search.

మెహబూబా డిమాండ్ ఎక్కువగా ఉందే

By:  Tupaki Desk   |   20 Feb 2018 5:30 PM GMT
మెహబూబా డిమాండ్ ఎక్కువగా ఉందే
X
గత కొన్నేళ్ల క్రితం ఎంతో బిజీగా ఉండే ఛార్మి ఇప్పుడు సినిమాల్లో కనిపించకుండా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టింది. సాధారణంగా ఛార్మి వయసులో చాలా మంది హీరోయిన్స్ ఇంకా కెరీర్ ను ఒక ట్రాక్ లో రన్ చేసుకుంటూ వెళుతుంటే ఛార్మి మాత్రం పూరి జగన్నాథ్ కంపెనీలో జాబ్ చేస్తోంది. చూస్తుంటే అమ్మడు దాదాపు నటనకు దూరం అయినట్లే తెలుస్తోంది. ప్రస్తుతం మెహబూబా చిత్ర యూనిట్ లో ఒక భాగమైన ఛార్మి ఆ సినిమా ప్రొడక్షన్ లో పాట్నర్ గా కూడా ఉంది.

పూరి జగన్నాథ్ తన సొంత నిర్మాణం లో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వస్తే.. మెహబూబా ఓవర్సీస్ హక్కులను ఛార్మి భారి రేట్ కి ఇచ్చేద్దాం అనుకుంటుందట. రూ 1.5 కోట్లకు అమ్మేయాలని ఆమె ప్లాన్. అయితే ఎక్కువగా మార్కెట్ లేని ఆకాశ్ పూరి కోసం అమ్మడు అంత రేట్ కు ఎలా చెబుతుందా అని అందరూ షాక్ అవుతున్నారు. ఇక పూరి జగన్నాథ్ డైరెక్షన్ వల్ల నమ్మకమా అనుకుంటే.. ఆయన గత సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. చివరగా వచ్చిన పైసా వసూల్ సినిమా 1.15 కోట్లకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోగా సినిమా మినిమామ్ లాభాలను కూడా అందించలేదు. రోగ్ సినిమా కూడా పూరి కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక 1.15 క్రోర్ రికవర్ కావాలంటే.. సగం మిలియన్ వసూలు చేయాలి.

అయితే ఇప్పుడు మెహబూబా పై కాస్త పాజిటివ్ వైబ్రెషన్స్ ఉన్నప్పటికీ పూరి బ్యాడ్ లక్ బయ్యర్స్ ని భయపెడుతోంది. అందుకే ఛార్మి డిమాండ్ చేస్తున్న అమౌంట్ చాలా రిస్క్ తో కూడుకున్నది. మరి ఏ విధంగా మెహబూబా సినిమాను ఓవర్సీస్ లో అమ్ముతారో చూడాలి.