Begin typing your search above and press return to search.
మెగా ఫ్యాన్స్ కి బన్నీ ఎందుకు టార్గెట్ అవుతున్నాడు...?
By: Tupaki Desk | 16 April 2020 8:00 PM ISTమెగాఫ్యామిలీ కరోనా పై పోరాటంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు.. అభిమానులకు సందేశాలు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ పై సాంగ్ లో యాక్ట్ చేయడమే కాకుండా అమితాబ్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ తో కలిసి కరోనా నివారణ జాగ్రత్తలు తెలియజేసాడు. అంతే కాకుండా ట్విట్టర్లో డైలీ కరోనాపై ఏదొక సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు. ఈ మధ్య మెగాస్టార్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్లకార్డులు ద్వారా కరోనా మెసేజ్ తెలిపిన సంగతి తెలిసిందే. "ఇంట్లో ఉంటాం.. యుద్ధం చేస్తాం.. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం.. భారీతీయులం ఒక్కటై భారత్ని గెలిపిస్తాం.. స్టే హోమ్.. స్టే సేఫ్" అంటూ చిరంజీవి కుటుంబ సభ్యులు సందేశాన్ని ఇచ్చారు. దీంట్లో చిరంజీవితో పాటు అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, ఉపాసన, రామ్ చరణ్, తన ఇద్దరు కూతుర్లు సుస్మిత, శ్రీజ, కళ్యాణ్ దేవ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. మొత్తానికి ఈ మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ప్లకార్డులు చూపిస్తూ ఒక మంచి సందేశాన్ని ప్రజలకు తెలిపారు.
అయితే ఇప్పుడు ఇదే ఇప్పుడు బన్నీని మళ్ళీ టార్గెట్ చేసేలా చేసింది. ఈ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించిన వాళ్లలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ లేడు. దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కళ్యాణ్ దేవ్, ఇంకా వెండితెరపై కనిపించని వైష్ణవ్ తేజ్ కూడా పాల్గొంటే అల్లు అర్జున్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పోనీ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తుందా అనుకోడానికి దీంట్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కనిపించారు. సో ఆ ఫ్యామిలీల మధ్య ఏమీ ఇబ్బందులు లేవని అర్థం అవుతోంది. అయితే కొంతమంది మాత్రం బన్నీ నెక్స్ట్ సినిమాలో గెట్ అప్ రివీల్ అవ్వకుండా ఉండటానికి బయటకి రాలేదేమో అని డౌట్ వ్యక్తం చేసారు. కానీ ఆల్రెడీ 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బన్నీ లుక్ బయటకి వచ్చేసింది. ఇంక దాని గురించి ఆలోచించాల్సిందేముంది అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
ఈ పోస్ట్ ని చిరు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తో పాటు అందరూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. బన్నీ దాంట్లో పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం ఆ పోస్ట్ షేర్ చేసుండొచ్చు కదా అనేది వారి ప్రశ్న. మరి బన్నీ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడా అంటే.. కుదిరినప్పుడల్లా ఏదొక పోస్ట్ పెడుతూనే ఉన్నాడు. ఈ మధ్య చాలా సందర్భాల్లో బన్నీని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఇన్సిడెంట్ తో మళ్ళీ టార్గెట్ చేసారు. వాస్తవానికి అదే మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ప్లకార్డుల మెసేజ్ లో పార్టిసిపేట్ చేయలేదు. మరి అలాంటిది పవన్ ని వదిలేసి కేవలం బన్నీనే మెగా ఫ్యాన్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో. బహుశా అల్లు అర్జున్ వేరే వర్క్ తో బిజీగా ఉన్నదేమో.. లేదా అందరం సేమ్ పోస్ట్ ఒకేసారి పెట్టడం ఎందుకు తర్వాత మరో పోస్ట్ తో ముందుకు రావొచ్చని భావించాడేమో... మెగా ఫ్యాన్స్ ఇలా కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
అయితే ఇప్పుడు ఇదే ఇప్పుడు బన్నీని మళ్ళీ టార్గెట్ చేసేలా చేసింది. ఈ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించిన వాళ్లలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ లేడు. దీంతో మెగా ఫ్యాన్స్ బన్నీపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. కళ్యాణ్ దేవ్, ఇంకా వెండితెరపై కనిపించని వైష్ణవ్ తేజ్ కూడా పాల్గొంటే అల్లు అర్జున్ ఎందుకు పార్టిసిపేట్ చేయలేదని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పోనీ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తుందా అనుకోడానికి దీంట్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్ కనిపించారు. సో ఆ ఫ్యామిలీల మధ్య ఏమీ ఇబ్బందులు లేవని అర్థం అవుతోంది. అయితే కొంతమంది మాత్రం బన్నీ నెక్స్ట్ సినిమాలో గెట్ అప్ రివీల్ అవ్వకుండా ఉండటానికి బయటకి రాలేదేమో అని డౌట్ వ్యక్తం చేసారు. కానీ ఆల్రెడీ 'పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా బన్నీ లుక్ బయటకి వచ్చేసింది. ఇంక దాని గురించి ఆలోచించాల్సిందేముంది అని ఫ్యాన్స్ అడుగుతున్నారు.
ఈ పోస్ట్ ని చిరు, రామ్ చరణ్, వరుణ్ తేజ్ తో పాటు అందరూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. బన్నీ దాంట్లో పార్టిసిపేట్ చేయకపోయినా కనీసం ఆ పోస్ట్ షేర్ చేసుండొచ్చు కదా అనేది వారి ప్రశ్న. మరి బన్నీ సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నాడా అంటే.. కుదిరినప్పుడల్లా ఏదొక పోస్ట్ పెడుతూనే ఉన్నాడు. ఈ మధ్య చాలా సందర్భాల్లో బన్నీని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఇన్సిడెంట్ తో మళ్ళీ టార్గెట్ చేసారు. వాస్తవానికి అదే మెగా ఫ్యామిలీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా ప్లకార్డుల మెసేజ్ లో పార్టిసిపేట్ చేయలేదు. మరి అలాంటిది పవన్ ని వదిలేసి కేవలం బన్నీనే మెగా ఫ్యాన్స్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో. బహుశా అల్లు అర్జున్ వేరే వర్క్ తో బిజీగా ఉన్నదేమో.. లేదా అందరం సేమ్ పోస్ట్ ఒకేసారి పెట్టడం ఎందుకు తర్వాత మరో పోస్ట్ తో ముందుకు రావొచ్చని భావించాడేమో... మెగా ఫ్యాన్స్ ఇలా కూడా ఆలోచిస్తే బాగుంటుంది.
