Begin typing your search above and press return to search.

'అఖండ' విడుదల తర్వాతే మాట్లాడతానంటున్న బోయపాటి..?

By:  Tupaki Desk   |   30 Nov 2021 7:59 AM GMT
అఖండ విడుదల తర్వాతే మాట్లాడతానంటున్న బోయపాటి..?
X
భద్ర' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బోయపాటి శీను.. టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలకృష్ణ - వెంకటేష్ - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేసిన బోయపాటి.. 'తులసి' సింహా' 'లెజెండ్' 'సరైనోడు' 'జయజానకి నాయక' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఐదేళ్ళ క్రితం వచ్చిన 'సరైనోడు' సినిమా సరైన సక్సెస్ అందుకోలేకపోయారు.

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీ వల్ల దర్శకుడు ప్లాప్ తో పాటుగా పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు బోయపాటి శ్రీను ఆశలన్నీ 'అఖండ' సినిమాపైనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ తో చేస్తున్న హ్యాట్రిక్ మూవీపై ధీమాగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోయపాటి మాట్లాడుతూ.. గుండెల మీద చేయి వేసుకుని చూసి బయటకు వచ్చేంత మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నానని తెలిపారు. దీనిని బట్టే 'అఖండ' సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థం అవుతుంది.

'అఖండ' చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. ట్రైలర్ - సాంగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. మరోవైపు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ - మ్యూజిక్ డైరెక్టర్ థమన్ - నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి - సీనియర్ నటుడు శ్రీకాంత్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలు తెలియజేస్తున్నారు. ఐతే బోయపాటి శ్రీను మాత్రం మీడియా ముందు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.

సాధారణంగా విడుదలకు ముందు దర్శకనిర్మాతలు నటీనటులు తమ సినిమాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తూ ఉంటారు. కొందరు మాత్రం రిలీజైన తర్వాత సక్సెస్ మీట్ లో మాట్లాడతామని చెబుతుంటారు. వాళ్ళు మీడియా ముందుకు వస్తారా లేదా అనేది సినిమా ఫలితం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా 'అఖండ' సినిమా విడుదలైన తర్వాతే విలేకరులతో మాట్లాడాలని అనుకుంటున్నారట.

'వినయ విధేయ రామ' సినిమా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు 'అఖండ' తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాననే గట్టి నమ్మకంతోనే.. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ జోష్ లో మాట్లాడాలని ఫిక్స్ అయ్యారని అంటున్నారు. బాలయ్య - బోయపాటి కాంబినేషన్ మీద ఉండే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి తగ్గట్లుగానే ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్లాపుల్లో ఉన్న దర్శక హీరోలిద్దరూ కచ్చితంగా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.