Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ క్వీన్.. లీకైన సీక్రెట్‌!

By:  Tupaki Desk   |   11 April 2022 5:37 AM GMT
ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ క్వీన్.. లీకైన సీక్రెట్‌!
X
'ఆర్ఆర్ఆర్‌' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకున్న‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. 'ఎన్టీఆర్ 30' వ‌ర్కింగ్ టైటిల్ తో జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై మిక్కిలినేని సుధాకర్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు.

ఇది పూర్తైన వెంట‌నే ఎన్టీఆర్ త‌న 31వ చిత్రాన్ని 'కేజీఎఫ్‌' తో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌బోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలైన‌ మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సీక్రెట్ లీకైంది.

అదేంటంటే.. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ న‌టించ‌బోతోంద‌ట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొణె. యూఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నాడు. 'ప్ర‌శాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయ‌బోతోంది. ఈ ప్రాజెక్ట్ డిసెంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది' అని తెలుపుతూ ఉమైర్ సంధు ఎన్టీఆర్‌-దీపికాల ఫొటోల‌ను షేర్ చేశారు.

ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలీదు గానీ.. ఈ న్యూస్ మాత్రం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో దీపికా త‌న‌కు టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ అంటే ఇష్ట‌మ‌ని.. ఆయ‌న న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ నుంచి తానెంతో స్పూర్తి పొందాన‌ని చెప్పుకొచ్చింది.

అలాగే ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అని కూడా పేర్కొంది. మ‌రి దీని ఆధారంగానే ఉమైర్ సంధు ట్వీట్ చేశారా..? లేక‌ నిజంగానే ఎన్టీఆర్31లో దీపికా హీరోయిన్‌గా ఫిక్స్ అయిందా..? అన్న‌ది తెలియాల్సి ఉంది.

కాగా, విభిన్నమైన పాత్రలను అలవోకగా పోషించే దీపికా పదుకొణె.. బాలీవుడ్, హాలీవుడ్‌తో పాటు అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. త్వ‌ర‌లోనే ఈమె 'ప్రాజెక్ట్-కె' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు.