Begin typing your search above and press return to search.

టాప్ నిర్మాతపై నిర్భయ కేసు నమోదు

By:  Tupaki Desk   |   18 Jan 2017 4:50 PM GMT
టాప్ నిర్మాతపై నిర్భయ కేసు నమోదు
X
బాలీవుడ్ బాద్షా షారూక్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్ని (దిల్ వాలే.. చెన్నైఎక్స్ ప్రెస్.. రా.వన్) రూపొందించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరీమ్ మురానీపై నిర్భయ కేసును బుక్ చేశారు. ఒక యువతిని ఆయన అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఆయనపై అత్యాచార కేసును హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీసులు బుక్ చేశారు. హైదరాబాద్ లో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధిత యువతి ఆరోపిస్తోంది.

సెక్ట్రం కుంభకోణంలో నిందితుడిగా ఉంటూ అరెస్ట్ అయి.. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన మురానీ తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి తనను పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా బాధిత యువతి ఆరోపిస్తోంది. దిల్ వాలే షూటింగ్ సమయంలో హైదరాబాద్ లోని హయత్ నగర్ సమీపంలో తనపై పలుమార్లు అత్యాచారం జరిగిందని సదరు యువతి పేర్కొంది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పారని.. ఒకసారి మత్తుమందు ఇచ్చి రేప్ చేసినట్లుగా పేర్కొంది. ఆ సమయంలో న్యూడ్ ఫోటోలు తీసి.. తనను బ్లాక్ మొయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా ఆరోపించింది.

ఈ విషయాల్ని బయటకు చెబితే.. చంపేస్తానని బెదిరించారని.. తనకు మాఫియాతో సంబంధాలుఉన్నట్లు పేర్కొన్నారని వెల్లడించింది. వేధింపులు తట్టుకోలేక తానిప్పుడు ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల్నిపరిశీలించిన హయత్ నగర్ పోలీసులు మురానీపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/