Begin typing your search above and press return to search.

'భూల్ భులైయా 2' ట్రైలర్: హారర్ కామెడీని తిరిగి తీసుకొచ్చిన కార్తీక్ - కియారా..!

By:  Tupaki Desk   |   26 April 2022 9:30 AM GMT
భూల్ భులైయా 2 ట్రైలర్: హారర్ కామెడీని తిరిగి తీసుకొచ్చిన కార్తీక్ - కియారా..!
X
హారర్ కామెడీ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిందీ చిత్రం ''భూల్ భులైయా 2''. 2007లో అక్షయ్ కుమార్ - విద్యా బాలన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'భూల్ భూలైయా' కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ - కియరా అద్వాణీ - టబు కీలక పాత్రలు పోషించారు.

కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడిన ''భూల్ భులైయా 2'' సినిమా.. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయింది. 2022 మే 20న థియేటర్లలో సందడి చేయడానికి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే పాత్రల ఫస్ట్ లుక్స్ మరియు మోషన్ పోస్టర్స్ వదిలారు.

ఈ క్రమంలో తాజాగా 'భూల్ భులైయా 2' ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. '15 ఏళ్ల తర్వాత మళ్లీ ఎవరో ఆ తలుపు తట్టారు.. ఆ తలుపు వెనుక ఉన్నది సాధారణ ఆత్మ కాదు..చేతబడి తెలిసిన మంజులికా' అని టబు చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అన్ని హారర్ సినిమాల మాదిరిగానే కథంతా ఒక హాంటెడ్ బంగ్లాలో జరుగుతుంది.

హాంటెడ్ హవేలీలో దెయ్యాన్ని వదిలించడానికి వచ్చిన రూహా బాబా గా కార్తిక్ ఆర్యన్‌ కనిపించారు. అక్కడ అతను కియరా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆత్మ బధించబడిన ఇంటి తలుపులు తెరిచిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి భయానక సంఘటనలు జరిగాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? ఆత్మ ను బయటకు పంపించారా లేదా? అనేది తెలియాలంటే 'భూల్ భులైయా 2' సినిమా చూడాల్సిందే.

సీక్వెల్ అయినప్పటికీ కొత్త పాత్రలతో కొత్త కథతో ఈ సినిమా రూపొందినట్లు అర్థం అవుతుంది. మొదటి భాగంలో ఉన్న రాజ్‌ పాల్ యాదవ్ పాత్రను మాత్రమే ఈ సినిమాలో చూడొచ్చు. అలానే ‘హరే రామ్ హరే కృష్ణ’ పాటను ఇందులో రీమిక్స్ చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో 'అమీ జే తోమర్' అనే ఐకానిక్ సాంగ్ కూడా వినిపిస్తోంది.

మొత్తం మీద కామెడీ తక్కువ.. హారర్ ఎక్కువ మోతాదులో ఉన్న 'భూల్ భులయ్యా 2' ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఫస్ట్ పార్ట్ కి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు ఈ సీక్వెల్ ను అనీస్ బాజ్మీ తెరకెక్కించారు. ప్రీతమ్ సంగీతం సమకూర్చారు. టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - మురాద్ భేతని - అజుం భేతని - కృష్ణన్ కుమార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.