Begin typing your search above and press return to search.

ఆ చెత్త కామెంట్లా? ఏడిసిందిలే!!

By:  Tupaki Desk   |   2 Aug 2017 5:32 PM GMT
ఆ చెత్త కామెంట్లా? ఏడిసిందిలే!!
X
ఆ మధ్యన అంతగా ఫేమస్ అవ్వని ఒక హీరోయిన్.. మహేష్‌ బాబు 1 నేనొక్కడినే సినిమాతో తెలుగువారికి పరిచయమైన కృతి సనోన్ పై కొన్ని చెత్త కామెంట్లు చేసింది. కొన్ని చిన్నచిన్న సినిమాల్లో నటించిన భైరవి గోస్వామి అనే నటీమణి.. కృతిని ఉద్దేశించి.. ''అసలు హెడ్ లైట్స్ లేవు.. బంపర్ లేవు.. ఈమె హీరోయిన్ ఏంటి??'' అంటూ కామెంట్ చేసింది. ఆ చెత్త కామెంట్లు కృతి అందాల తాలూకు కొలతల గురించేనని వేరే చెప్పక్కర్లేదుగా.

అయితే ఆ మధ్యన రాబ్తా సినిమా ఫ్లాపైన బాధలో ఉన్న కృతి.. ఇప్పుడు 'బరేలి కి బర్ఫీ' సినిమా ట్రైలర్ కు మంచి క్రేజ్ రావడంతో అమ్మడు చాలా ఉత్సాహంతో ఉంది. అందుకే బయటకొచ్చి మీడియాకు తెగ ఇంటర్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా కొందరు మీడియావారు సదరు హెడ్ లైట్స్ అండ్ బంపర్ కామెంట్లను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన కృతి.. ''అసలు ఈ భైరవీ గోస్వామి ఎవరండీ? నాకు తెలియదంటే ఎవ్వరికీ తెలియదనే అర్దం. పోన్లేండి ఆమె ప్రయత్నం నన్ను కామెంట్ చేసి పబ్లిసిటీ పొందాలనే. ఈరోజు అందరూ ఆమె గురించి చెబుతున్నారంటే.. సక్సెస్ అయ్యిందనేగా. ఎంజాయ్ చెయ్యనివ్వండి'' అనేసింది. అయితే ఈ కామెంట్లను కృతి ఏ టోన్ లో చేసిందంటే.. ఏడిసిందిలే అనే తరహాలో చెప్పింది.

అంతేకదండీ మరి.. అసలు భైరవి చేసిందే చెత్త కామెంట్లు. పైగా ఆమె ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు కృతి సనోన్ ఏకంగా పెద్ద పెద్ద సూపర్ స్టార్లతో నటిస్తోంది. అందుకే కృతిని కామెంట్ చేసి ఆమె మైలేజ్ పొందింది. కాకపోతే ఇలాంటి చెత్త కామెంట్లను చేస్తున్నవారికి ఏదో తరహాలో బుద్ది చెప్పాల్సిందే అంటున్నారు కృతి ఫ్యాన్స్!!