Begin typing your search above and press return to search.

షూట్ అప్ డేట్ : పొలాచ్చిలో అల్లుడు శీను అల్ల‌రి

By:  Tupaki Desk   |   30 Aug 2017 7:58 AM GMT
షూట్ అప్ డేట్ : పొలాచ్చిలో అల్లుడు శీను అల్ల‌రి
X
జ‌య‌జాన‌కినాయ‌కతో మాస్ ఆడియెన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న బెల్ల‌కొండ శ్రీనివాస్ ఇప్పుడు అదే ఊపుతో త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్ లో సంద‌డి చేస్తున్నాడు. అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకం పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిక్టేట‌ర్ ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. డీజేతో ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పూజా హెగ్ధే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. జ‌య‌జాన‌కి నాయ‌క సెట్స్ పైనే ఉండ‌గానే త‌న నాలుగో సినిమాను ప్రారంభించిన బెల్లంకొండ శ్రీను ప్ర‌స్తుతం పొలాచ్చిలో జ‌రుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు.

బాహుబ‌లి - పులిమురుగ‌న్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ కి యాక్ష‌న్ సీక్వెన్సులు స‌మ‌కూర్చిన పీట‌ర్ హేన్స్ ఈ చిత్రానికి ఫైట్ కొరియోగ్రాఫ‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నాడు. పొలాచ్చిలో 15 రోజులు షెడ్యూల్ లో పోరాట స‌న్నివేశాల్ని చిత్రీక‌రించేందుకు శ్రీవాస్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తుంది. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటు స్టార్ క‌మీడియ‌న్ వెన్నెల కిషోర్ - హీరోయిన్ పూజా హెగ్ధే - జ‌గ‌ప‌తిబాబు - శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు పాల్గొంటారని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పొలాచ్చి షూట్ కంప్లీట్ చేసి త‌దుప‌రి షెడ్యూల్ ని హైద‌రాబాద్ లో ప్లాన్ చేస్తున్న‌ట్లుగా స‌మాచారం. మ‌రి జ‌య‌జాన‌కి త‌రువాత తెర‌కెక్కుతున్న ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల్ని అల్లుడు శీను ఏ రేంజ్ లో ఆక‌ట్టుకుంటాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.