Begin typing your search above and press return to search.

ఆ న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తోందా...?

By:  Tupaki Desk   |   20 Jun 2020 10:50 AM GMT
ఆ న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తోందా...?
X
టాలీవుడ్‌ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇతర ఇండస్ట్రీలలో పలువురు సినీ ప్రముఖులకు కరోనా సోకగా ఇప్పుడు మన టాలీవుడ్ కి కూడా అంటుకుందని అంటున్నారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్‌ గా తేలినట్లు నిన్నటి నుండి వార్తలు వస్తున్నాయి. బండ్ల గణేష్ తరచుగా షాద్‌నగర్‌ లోని తన ఫౌల్ట్రీ ఫారమ్‌ కు వెళ్లి వస్తుంటారని.. ఈ క్రమంలో ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ గా నిర్ధారించారని న్యూస్ స్ప్రెడ్ అయింది. కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా సైలెంటుగా టెస్టులు చేయించుకుంటున్నారని.. బండ్ల గణేష్ ఉండే ఏరియాలో ఉన్న మిగతా సెలెబ్రిటీలు కంగారు పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై బండ్ల గణేష్ కానీ ఆయన ఫ్యామిలీ మెంబెర్స్ కానీ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. ఇప్పటి దాకా కరోనా ఫ్రీ గా ఉన్న టాలీవుడ్ ఒక్కసారిగా ఈ వార్తతో కంగారు పడింది. బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అనే వార్తలో కన్ఫర్మేషన్ లేనప్పటికీ టాలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారట.

ఇప్పుడిప్పుడే షూటింగులకు అనుమతులు వస్తుండగా చిత్రీకరణ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో సినీ ప్రముఖులకు కరోనా అంటూ న్యూస్ రావడంతో ఆలోచనలో పడ్డారట. దీనికి తోడు రోజురోజుకీ కరోనా కేసులు కూడా అధికమవుతుండటంతో.. షూటింగ్స్ మొదలుపెడదాం అనుకుంటున్న వారు తమ నిర్ణయం వెనక్కి తీసుకొనే ఆలోచన చేస్తున్నారట. ఇక సీనియర్ హీరోలు సైతం వయసురీత్యా షూటింగ్ కి రావడానికి ససేమిరా అంటున్నారట. ఈ నేపథ్యంలో షూటింగ్స్ విషయంలో అందరూ వేచి చూసే ధోరణి అవలంభించి అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద బండ్ల గణేష్ పై వచ్చిన వార్తలో నిజమెంతో తెలియదు కానీ టాలీవుడ్ ని మాత్రం షేక్ చేసిందని చెప్పవచ్చు.