Begin typing your search above and press return to search.

జ‌య‌మ్మా మ‌జాకా.. బాల‌య్య‌కే షాకిచ్చేసింద‌ట‌!

By:  Tupaki Desk   |   5 Nov 2022 11:30 PM GMT
జ‌య‌మ్మా మ‌జాకా.. బాల‌య్య‌కే షాకిచ్చేసింద‌ట‌!
X
త‌మిళ న‌టుడు శ‌ర‌త్ కుమార్ న‌ట వార‌సురాలిగా తెరంగేట్రం చేసిన వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిగా త‌న‌దైన మార్కు న‌ట‌న‌తో, ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ల‌తో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. త‌మిళంలో శింబు హీరోగా న‌టించిన 'పోడా పొడి' సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన వ‌ర‌ల‌క్ష్మీ ఆ త‌రువాత క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్ గా ట‌ర్న్ అయి త‌ను మాత్ర‌మే చేయ‌ద‌గ్గ ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టిస్తూ రాణిస్తోంది. తెలుగులో 'తెనాలి రామ‌కృష్ణ బిఏ బిఎల్‌' మూవీతో ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా మంచి పేరు తెచ్చుకుంది.

అయితే వ‌రక్ష్మికి ప్ర‌శంస‌ల్ని అందించింది మాత్రం మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన‌ 'క్రాక్‌' మూవీనే. ఇందులో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ 'జ‌య‌మ్మ‌' పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ పాత్రలో వ‌రుని చూసి మెగాస్టార్ స్వ‌యంగా ప్ర‌శంస‌లు కురిపించారంటే ఆ పాత్ర‌, ఆ సినిమా వ‌ర‌ల‌క్ష్మికి అంత‌గా గుర్తింపుని తెచ్చి పెట్ట‌డ‌మే కాకుండా టాలీవుడ్ లో త‌న కోసం ద‌ర్శ‌కులు ప్ర‌త్యేక పాత్ర‌ల‌ని సృష్టించేలా చేసింది. త‌రువాత న‌రేష్ తో క‌లిసి 'నాంది' మూవీలో లాయ‌ర్ గా కీల‌క పాత్ర‌లో క‌నిపించి సినిమా విజ‌యానికి ఓ కార‌ణంగా నిలిచింది.

ఈ రెండు సినిమాల‌తో టాలీవుడ్ లో క్రేజీ స్టార్ల మూవీస్ ల‌లో ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుని బ్యాక్ టు బ్యాక్ వ‌రుస మూవీస్ తో బిజీ బిజీగా గ‌డిపేస్తోంది. స‌మంత‌తో 'య‌శోద', తేజ్ స‌జ్జ‌తో 'హ‌ను మాన్', నంద‌మూరి బాల‌కృష్ణ‌తో 'వీరసింహారెడ్డి' వంటి సినిమాల్లో న‌టిస్తోంది. ఈ సినిమాల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌తో క‌లిసి చేస్తున్న‌'వీరసింహారెడ్డి'లో బాల‌య్య‌కు ధీటుగా నిల‌బ‌డే ప‌ద్మ‌గా క‌నిపించ‌బోతోంది. సినిమాలో త‌న పాత్ర హైలైట్ గా వుంటుంద‌ట‌.

వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ మూవీని గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణకు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ - బాల‌య్య పాల్గొన‌గా ఓ కీల‌క ఘ‌ట్టాన్ని చిత్రీక‌రించార‌ట‌.

ఈ సీన్ లో ఐదు పేజీల డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పి బాల‌య్య‌నే షాక్ కు గురి చేసింద‌ట‌. బాల‌య్య కాంబినేష‌న్ లో సీన్ కావ‌డంతో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఈ సీన్ ని చేయ‌డం అంత ఈజీ కాద‌ని అంతా భావించార‌ట‌.

అయితే అంద‌రికి షాకిస్తూ వ‌ర‌ల‌క్ష్మి సింగిల్ టేక్ లో ఐడు పేజీల డైలాగ్ ని పూర్తి చేయ‌డంతో బాల‌య్య‌తో పాటు అంతా అవాక్క‌య్యార‌ట‌. సినిమాలో ఈ సీన్ ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది. అంతే కాకుండా వ‌రు కెరీర్ కి ఈ మూవీ కీల‌క మ‌లుపుగా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.