Begin typing your search above and press return to search.

'ఆదిత్య 369' సీక్వెల్ తో NBK పాన్ ఇండియా ప్లాన్!

By:  Tupaki Desk   |   8 Jun 2020 10:50 AM GMT
ఆదిత్య 369  సీక్వెల్ తో NBK పాన్ ఇండియా ప్లాన్!
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్ర‌యోగం విఫ‌ల‌మ‌య్యాక బ్లాక్ బ‌స్టర్ తో కంబ్యాక్ అయ్యేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న ఆస్థాన ద‌ర్శ‌కుడు బోయ‌పాటికి ఆ బాధ్య‌త‌ను అప్ప‌గించారు. ఈ కాంబినేష‌న్ మూవీ ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్త‌యింది. ఇటీవ‌ల లాక్ డౌన్ కార‌ణంగా కొత్త షెడ్యూల్ వాయిదా వేశారు.

ఇక ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఘోరా పాత్ర‌లో అలాగే బిజినెస్ మేన్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మోనార్క్ అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య ఏ సినిమాలో న‌టిస్తారు? అంటే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆయ‌న కెరీర్ లో మ‌రోసారి భారీ ప్ర‌యోగం చేయ‌బోతున్నార‌ని .. సైన్స్ ఫిక్ష‌న్.. ఫాంట‌సీ త‌ర‌హా సినిమాలో న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్- బి.గోపాల్ స‌హా ప‌లువురు ద‌ర్శ‌కులు ఆయ‌న క్యూలో ఉన్నారు. వీళ్ల‌లో ఎవ‌రికి ముందుగా గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారు? అన్న‌ది తెలీదు. అయితే ఈలోగానే సింగీతం శ్రీ‌నివాస‌రావు ఆదిత్య 369 సీక్వెల్ క‌థ‌ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది‌. ఇప్ప‌టికే బాల‌య్య‌తో మంత‌నాలు సాగించార‌ని క‌థా చ‌ర్చ‌లు పూర్తి చేశార‌ని వెల్ల‌డైంది‌. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ కావడం వల్ల భారీ బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంద‌ట‌.

అయితే గ‌త ఐదారేళ్లుగా ఈ సీక్వెల్ పై చ‌ర్చ సాగుతోంది. ఆదిత్య 999 అనే టైటిల్ కూడా వినిపించింది. ఎట్ట‌కేల‌కు 2020లో మ‌రోసారి క‌ద‌లిక వ‌చ్చింది. ఆదిత్య 369 అభిమానులు చాలా కాలంగా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అలాగే బాల‌య్య‌ను పాన్ ఇండియా స్టార్ గా చూడాల‌నేది నంద‌మూరి అభిమానుల కోరిక‌. అందుకే క‌నీసం 2021లో అయినా ఈ ప్రాజెక్టు ప్రారంభ‌మ‌వుతుందేమో చూడాలి.