Begin typing your search above and press return to search.

'ఎన్టీఆర్ కు వెన్నుపోటు' పై బాలయ్య కన్నీళ్లతో స్పందన

By:  Tupaki Desk   |   6 Dec 2021 1:00 PM GMT
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పై బాలయ్య కన్నీళ్లతో స్పందన
X
'అన్ స్టాపబుల్'.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ షో మొదలైనప్పటి నుంచి పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. మొట్టమొదట మోహన్ బాబు ఫ్యామిలీని ఇంటర్వ్యూ చేసిన బాలయ్య తర్వాత నాని, ఇటీవలే మహేష్ బాబుతోనూ ముచ్చటించారు. ఇక తాజాగా తనకు హిట్ అందించిన 'అఖండ' మూవీ టీంతో చిట్ చాట్ నిర్వహించారు.

ఈ షో ద్వారా బాలయ్యలోని కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేస్తున్నారు. బాలయ్య హుషారుగా ఇంత సరదాగా.. ఏ తడబాటు లేకుండా షోను నడిపిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక షోలో కొన్ని వివాదాస్పద విషయాల మీద బాలయ్య ఓపెన్ అయిపోతుండడం.. తనదైన శైలిలో స్పందిస్తుండడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రాజకీయాలతో ముడిపడ్డ సంచలన విషయాలు బాలకృష్ణ బయటపెడుతున్నాడు. షో తొలి ఎపిసోడ్ లో మోహన్ బాబు తాగే మద్యం గురించి అడిగి షాకిచ్చిన బాలయ్య.. ఆ తర్వాత మోహన్ బాబు అడిగిన 'టీడీపీ పగ్గాలు ఎందుకు చేపట్టలేదు' అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాడు. వారసత్వ రాజకీయాలకు తాను దూరం అని చెప్పడానికే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

తాజాగా మరో సున్నిత వివాదాస్పద విషయం గురించి బాలయ్య ఓపెన్ అయిపోయాడు. ఈ షోలో 'అఖండ' టీం సభ్యులైన బోయపాటి శీను, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ తో బాలయ్య కొత్త ఎపిసోడ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో చాలా వరకు సరదాగా సాగిపోయింది కానీ.. చివర్లో భారీ ట్విస్ట్ నెలకొంది.

చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడనే ఆరోపణల గురించి బాలయ్య స్పందించాడు. అందరూ వెన్నుపోటు అంటుంటారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కానీ అబద్దమని బాలయ్య వివరణ ఇచ్చాడు.

వెన్నుపోటు అంటుంటే తనకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయంటూ బాలయ్య ఎమోషనల్ అవ్వడం గమనార్హం. తాను ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకడినే కాదని.. ఆయన అభిమానన్నారు. ఈ ప్రోమో అంతే కట్ చేయడంతో బాలయ్య 'వెన్నుపోటు' గురించి ఏం చెప్పాడన్నది ఆసక్తి రేపుతోంది. ఫుల్ ఎపిసోడ్ కోసం అందరూ వెయిల్ చేయాల్సిందే..