Begin typing your search above and press return to search.

పార్క్ లో టాలీవుడ్ హీరోయిన్ దాడి.. తర్వాత ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   15 Nov 2021 3:38 AM GMT
పార్క్ లో టాలీవుడ్ హీరోయిన్ దాడి.. తర్వాత ఏం చేశారంటే?
X
హైదరాబాద్ లో సినీ నటిపై దాడి కలకలం రేపింది. బంజారాహిల్స్ పరిధిలో ఉన్న కేబీఆర్ పార్క్ లో ఉదయం, సాయంత్రం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కేబీఆర్ పార్క్ లో కేవలం వాకింగ్ చేయడం మాత్రమే కాదు.. నేరాలు కూడా జరుగుతున్నాయి.

తాజాగా కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటిపై దాడి జరిగింది. చౌరాసియా అనే వర్ధమాన హీరోయిన్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకుడు దాడి చేసి ఆమె వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన నటి ఫోన్ ను గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది.

అనంతరం హీరోయిన్ చౌరాసియాపై దాడి చేసి ఆమె సెల్ ఫోన్ ను ఆగంతకుడు ఎత్తుకుపోయాడు. నటి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన చౌరాసియాను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై విచారణ జరుపుతున్నాయి.

కేబీఆర్ పార్క్ లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి. సామాన్యులతోపాటు సెలబ్రెటీలు సైతం వాకింగ్ , జాగింగ్ చేయడానికి కేబీఆర్ పార్క్ కు వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ పోలీసులు కూడా కాపలా కాస్తూ ఉంటారు.

ప్రస్తుతం కేబీఆర్ పార్క్ లో దాడి నేపథ్యంలో పోలీసులు మరింత సెక్యూరిటీ పెంచేందుకు డిసైడ్ అయ్యారు.