Begin typing your search above and press return to search.

దాసరి కోడలిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

By:  Tupaki Desk   |   13 Sep 2018 6:17 AM GMT
దాసరి కోడలిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు
X
ప్రముఖ దర్శకుడు, దివంగత దాసరి నారాయణ రావు కొడుకు తారక హరిహర ప్రభుకు ఇంటిపోరు ఎక్కువైంది. ఆయన మొదట సుశీల అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత పద్మ అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం దాసరి కొడుకు ప్రభు రెండో భార్య పద్మతో జూబ్లీహిల్స్ లోని రోడ్ నంబర్ 46లో గల ఇంట్లో నివాసముంటున్నాడు. అయితే మొదటి భార్య సుశీల మాత్రం ఆస్తి కోసం ఫైట్ చేస్తోందని తెలిసింది..

తాజాగా సెప్టెంబర్ 10న రాత్రి 7 గంటలకు మొదటి భార్య సుశీల - సంధ్య అనే మహిళతో కలిసి దాసరి ప్రభు ఇంట్లోకి ప్రవేశించి రెండో భార్య పద్మపై దాడి చేశారు. ఈ మేరకు పద్మ.. జూబ్లీహిల్స్ పోలీసులకు సుశీల, సంధ్యలపై ఫిర్యాదు చేసింది. ఆ రాత్రి సుశీల - సంధ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని.. ఈ నెల 11న తెల్లవారుజామున కిచెన్ లోకి వెళ్తున్న తనపై కర్రతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ మేరకు పోలీసులు దాసరి ప్రభు మొదటి భార్య సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేసి ద్యాప్తు చేపట్టారు. కాగా తారక హరిహరి ప్రభు ఆస్తిలో వాటా కోసమే ఆయన మొదటి భార్య సుశీల ఇలా రెండో భార్య పద్మపై దాడికి దిగి., ఆందోళనకు పూనుకున్నట్టు పోలీసులు తెలిపారు.