Begin typing your search above and press return to search.

ముగ్గురు బ్యూటీలతో ధృవ విలన్ రొమాన్స్

By:  Tupaki Desk   |   8 Oct 2016 11:11 AM GMT
ముగ్గురు బ్యూటీలతో ధృవ విలన్ రొమాన్స్
X
రోజా.. బొంబాయి లాంటి సినిమాలతో ఓ జనరేషన్ కిందట.. అరవింద్ స్వామి అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆ తర్వాత ఆ రేంజ్ స్టార్ డమ్ కొనసాగించలేకపోయిన ఈయన.. మళ్లీ ఇప్పుడు ఫుల్లు బిజీ అయిపోతున్నాడు. తమిళ్ మూవీ తని ఒరువన్ లో విలన్ గా నటించి.. ఫామ్ లోకి వచ్చేశాడు.

స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి యాక్టింగ్ ని కానీ.. స్టార్ డం కి కానీ పోటీ ఇచ్చే నటుడు మరొకరు దొరక్క.. రామ్ చరణ్ తో తెలుగు రీమేక్ ధృవలో కూడా ఈయన్నే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అరవింద్ స్వామికి క్రేజ్ ఊపందుకోవడంతో.. హీరో వరుసగా సినిమా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. మలయాళ మూవీ భాస్కర్ ది రాస్కెల్ కు తమిళ్ రీమేక్ తీయనుండగా.. ఇందులో అరవింద్ స్వామికి జోడీగా నయనతార నటించనుంది. చతురంగ వేట్టైకు సీక్వైల్ తీయనుండగా.. ఇందులో అరవింద్ స్వామినే ఫైనల్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు త్రిష అంగీకరించింది.

ఇప్పుడు అరవింద్ స్వామి హీరోగా మూడో సినిమా కూడా ఫిక్స్ కాగా.. ఇందులో మలయాళ టాప్ బ్యూటీ మంజు వారియర్ నటిస్తోంది. నయనతార.. త్రిష.. మంజు వారియర్ లాంటి టాప్ బ్యూటీలతో ఒకేసారి సినిమాలు ఫైనల్ అయ్యాయంటే.. అరవింద్ స్వామి క్రేజ్ ఏ రేంజ్ లో రీబౌండ్ అయిందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/