Begin typing your search above and press return to search.
మైత్రికి ముందుంది ముసళ్ల పండగ
By: Tupaki Desk | 25 Feb 2020 10:31 AM GMTటాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఏఏ 20 సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లర్ల కాన్సెప్టుతో థ్రిల్లర్ ఫార్మాట్ లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో బన్ని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర(లారీ డ్రైవర్) లో నటిస్తున్నాడని ప్రచారమవుతోంది.
ఇప్పటికే సినిమా లాంఛనంగా ప్రారంభమైనా ఇంకా కీలక షెడ్యూల్ చిత్రీకరణకు వెళ్లలేదు. శేషాచలం అడవుల్లో చిత్రీకరణ వీలుకాకపోవడం... విదేశాలకు వెళ్లాలంటే కరోనా ఎఫెక్ట్.. మొత్తానికి లేట్ కి కారణమైంది. ఇక ఈ సినిమాతో మైత్రి వాళ్లు హ్యాపీగా ఉన్నారా లేక అన్ హ్యాపీనా? అంటే రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమంటే బన్ని సహజంగానే చాలా హార్డ్ వర్కర్. సుక్కూ లాంటి పర్ఫెక్షనిస్ట్ యాడయ్యాడు. దీంతో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనే మైండ్ సెట్ తో ఉంటాడు. దానికి తోడు అల వైకుంఠపురములో వల్ల బన్ని మార్కెట్ అమాంతం పెరిగింది. కేవలం నైజాం నుంచే ఈ చిత్రం 40 కోట్లు వసూలు చేయడంతో మైత్రి వాళ్లు తాజా చిత్రాన్ని ఆ రేంజులేనే ఇక్కడ అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అంత పెద్ద మొత్తం ఇచ్చి కొనేవాళ్లు ఉంటారా? ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? ఐతే సొంత రిలీజ్ కి అయినా వెళ్లాల్సి ఉంటుంది. కానీ బిజినెస్ చేయకుండా ఇలాంటి పెద్ద సెంటర్స్ వోన్ రిలీజ్ చేయడానికి బన్ని ఒప్పుకోడు. అలాంటప్పుడు మైత్రి వాళ్లకు ముందుంది ముసళ్ల పండగ అనే సామెత వర్కవుటవుతుందేమో!!
ఇప్పటికే సినిమా లాంఛనంగా ప్రారంభమైనా ఇంకా కీలక షెడ్యూల్ చిత్రీకరణకు వెళ్లలేదు. శేషాచలం అడవుల్లో చిత్రీకరణ వీలుకాకపోవడం... విదేశాలకు వెళ్లాలంటే కరోనా ఎఫెక్ట్.. మొత్తానికి లేట్ కి కారణమైంది. ఇక ఈ సినిమాతో మైత్రి వాళ్లు హ్యాపీగా ఉన్నారా లేక అన్ హ్యాపీనా? అంటే రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమంటే బన్ని సహజంగానే చాలా హార్డ్ వర్కర్. సుక్కూ లాంటి పర్ఫెక్షనిస్ట్ యాడయ్యాడు. దీంతో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనే మైండ్ సెట్ తో ఉంటాడు. దానికి తోడు అల వైకుంఠపురములో వల్ల బన్ని మార్కెట్ అమాంతం పెరిగింది. కేవలం నైజాం నుంచే ఈ చిత్రం 40 కోట్లు వసూలు చేయడంతో మైత్రి వాళ్లు తాజా చిత్రాన్ని ఆ రేంజులేనే ఇక్కడ అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అంత పెద్ద మొత్తం ఇచ్చి కొనేవాళ్లు ఉంటారా? ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా? ఐతే సొంత రిలీజ్ కి అయినా వెళ్లాల్సి ఉంటుంది. కానీ బిజినెస్ చేయకుండా ఇలాంటి పెద్ద సెంటర్స్ వోన్ రిలీజ్ చేయడానికి బన్ని ఒప్పుకోడు. అలాంటప్పుడు మైత్రి వాళ్లకు ముందుంది ముసళ్ల పండగ అనే సామెత వర్కవుటవుతుందేమో!!