Begin typing your search above and press return to search.
ఏఎన్నార్ జయంతికి భారీ ప్లాన్స్
By: Tupaki Desk | 15 Sep 2018 6:47 AM GMTఅన్నపూర్ణ స్టూడియోస్ అధినేత - లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిట్టచివరి చిత్రం `మనం` చిత్రాన్ని అభిమానులు ఎప్పటికీ మరువలేరు. ఎన్ని క్లాసిక్స్ లో నటించినా మనం ఏఎన్నార్ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. తనకు క్యాన్సర్ ఉందని తెలిసీ - అసలు ఆ భయాన్ని కానీ - దుఃఖాన్ని కానీ ఏఎన్నార్ ఏనాడూ బయటకు చూపించకపోవడం ఎందరినో షాక్కి గురి చేసింది. మనం సెట్స్లో ఉండగానే ఆ భయానక నిజం బయటపడింది. ఓవైపు చికిత్స సాగుతూనే ఉంది. మరోవైపు మొండివాడిగా `మనం` సినిమాలో ఆయన నటిస్తూనే ఉన్నారు. మరోవైపు ప్రెస్ మీట్లు పెట్టి అన్నపూర్ణ కాంపౌండ్ లో అందరినీ ధైర్యంగా ఉండమని ఆయన వెన్నుతట్టిన విధానం.. అభిమానుల గుండెల్ని టచ్ చేసింది.
ఆ మెమరీస్ ని ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. మనం చిత్రంలో అభినవ యువకుడిలా ఆయన ఎంతో వైబ్రేంట్ గా నటించి మనసు దోచారు. ముఖ్యంగా ఆ చిత్రంలో ఏఎన్నార్ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. పెగ్గు మాయం చేయడంలో - మందుకొట్టడంలో దేవదాస్నే గుర్తు చేశారు. ప్రతి ఒక్క అక్కినేని అభిమాని కళ్లలో ఆ సన్నివేశాలు పదే పదే స్ఫురణకు వస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ఇంపాక్ట్ ఉన్న నటుడు కాబట్టే ఇండస్ట్రీ ఎనిమిదిన్నర దశాబ్ధాల చరిత్రలో సగం హిస్టరీ ఆయనకే అంకితమైంది. ఎన్టీఆర్ సమకాలికుడిగా అతడు తన కరిష్మాని నిలబెట్టుకునేందుకు గొప్ప సాధకుడిగా కృషి చేశారు. ఎంతో క్రమశిక్షణ - జాగ్రత్త ఉన్న నటుడిగా అతడు ఘనుతికెక్కారు. అందుకే ఏఎన్నార్ ప్రతి జయంతిని అభిమానులు ఓ పండుగలా నిర్వహిస్తున్నారు.
యథావిధిగా ఈసారి కూడా అక్కినేని అభిమానులు ఘనమైన ప్లానింగ్స్ తో బిజీ అయిపోయారు. ఈనెల 20న అక్కినేని జయంతి సందర్భంగా ప్రత్యేకంగా అభిమానులు సెలబ్రేషన్స్ని ప్లాన్ చేస్తున్నారు. రవీంద్రభారతి వంటి చోట్ల పలు అక్కినేని సేవాసమితి కళా బృందాలతో.. లైవ్ ఆర్కెస్ట్రాలతో అభిమానుల్ని అలరించే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు ఏఎన్నార్ జూబ్లీహిల్స్ స్వగృహంలోనూ ఆయన అభిమానులు ప్రతియేటా చేస్తున్నట్టే ఈసారి జయంతి ఉత్సవాల్ని చేయనున్నారు. తాత సెలబ్రేషన్స్ లో అక్కినేని యువహీరోలు నాగచైతన్య - అఖిల్ - సుమంత్ - సుశాంత్ పాల్గొననున్నారని తెలుస్తోంది.
ఆ మెమరీస్ ని ఫ్యాన్స్ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. మనం చిత్రంలో అభినవ యువకుడిలా ఆయన ఎంతో వైబ్రేంట్ గా నటించి మనసు దోచారు. ముఖ్యంగా ఆ చిత్రంలో ఏఎన్నార్ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. పెగ్గు మాయం చేయడంలో - మందుకొట్టడంలో దేవదాస్నే గుర్తు చేశారు. ప్రతి ఒక్క అక్కినేని అభిమాని కళ్లలో ఆ సన్నివేశాలు పదే పదే స్ఫురణకు వస్తూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి ఇంపాక్ట్ ఉన్న నటుడు కాబట్టే ఇండస్ట్రీ ఎనిమిదిన్నర దశాబ్ధాల చరిత్రలో సగం హిస్టరీ ఆయనకే అంకితమైంది. ఎన్టీఆర్ సమకాలికుడిగా అతడు తన కరిష్మాని నిలబెట్టుకునేందుకు గొప్ప సాధకుడిగా కృషి చేశారు. ఎంతో క్రమశిక్షణ - జాగ్రత్త ఉన్న నటుడిగా అతడు ఘనుతికెక్కారు. అందుకే ఏఎన్నార్ ప్రతి జయంతిని అభిమానులు ఓ పండుగలా నిర్వహిస్తున్నారు.
యథావిధిగా ఈసారి కూడా అక్కినేని అభిమానులు ఘనమైన ప్లానింగ్స్ తో బిజీ అయిపోయారు. ఈనెల 20న అక్కినేని జయంతి సందర్భంగా ప్రత్యేకంగా అభిమానులు సెలబ్రేషన్స్ని ప్లాన్ చేస్తున్నారు. రవీంద్రభారతి వంటి చోట్ల పలు అక్కినేని సేవాసమితి కళా బృందాలతో.. లైవ్ ఆర్కెస్ట్రాలతో అభిమానుల్ని అలరించే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు ఏఎన్నార్ జూబ్లీహిల్స్ స్వగృహంలోనూ ఆయన అభిమానులు ప్రతియేటా చేస్తున్నట్టే ఈసారి జయంతి ఉత్సవాల్ని చేయనున్నారు. తాత సెలబ్రేషన్స్ లో అక్కినేని యువహీరోలు నాగచైతన్య - అఖిల్ - సుమంత్ - సుశాంత్ పాల్గొననున్నారని తెలుస్తోంది.