Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ పూర్తి చేశాడు..!
By: Tupaki Desk | 12 May 2021 5:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''అన్నాత్తే''. డైరెక్టర్ సిరుతై శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా గత నెల రోజులుగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే సోమవారంతో రజనీకాంత్ కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. నెల రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేసిన రజినీ.. తన పోర్షన్ షూట్ కంప్లీట్ అవడంతో చెన్నై కు బయలు దేరి వెళ్లారు.
నిజానికి మహమ్మారి వైరస్ కి భయపడి యువ హీరోలే షూటింగ్ నిలిపివేస్తే.. వయసు మీద పడిన రజనీ చిత్రీకరణలో పాల్గొనడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రజినీ రిస్క్ చేయడం అవసరమా అని కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. అయినా సరే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ సీనియర్ సూపర్ స్టార్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో రజినీ తో పాటుగా ప్రధాన తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలు తీసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ నయనతార ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.
రజినీకాంత్ ఓ వారం విశ్రాంతి తీసుకుని 'అన్నాతే' సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇది అయిన కెరీర్ లో వస్తున్న 168వ సినిమా. ఈ చిత్రంలో కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా 'అణ్ణాత్తే' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
నిజానికి మహమ్మారి వైరస్ కి భయపడి యువ హీరోలే షూటింగ్ నిలిపివేస్తే.. వయసు మీద పడిన రజనీ చిత్రీకరణలో పాల్గొనడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రజినీ రిస్క్ చేయడం అవసరమా అని కామెంట్స్ చేసిన వారు కూడా ఉన్నారు. అయినా సరే కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ సీనియర్ సూపర్ స్టార్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో రజినీ తో పాటుగా ప్రధాన తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలు తీసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ నయనతార ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.
రజినీకాంత్ ఓ వారం విశ్రాంతి తీసుకుని 'అన్నాతే' సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇది అయిన కెరీర్ లో వస్తున్న 168వ సినిమా. ఈ చిత్రంలో కీర్తి సురేష్ - మీనా - ఖుష్బు - ప్రకాష్ రాజ్ - జగపతిబాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. దీపావళి కానుకగా 'అణ్ణాత్తే' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.