Begin typing your search above and press return to search.

అనిల్ రాస్తున్న కథ అదేనా.. అయితే అంతే..!

By:  Tupaki Desk   |   22 March 2020 3:30 AM GMT
అనిల్ రాస్తున్న కథ అదేనా.. అయితే అంతే..!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస విజయాల తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అనిల్ రావిపూడి మాత్రమే. పటాస్ సినిమా మొదలుకొని సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, లతో పాటు రీసెంట్ గా సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా అనిల్ రావిపూడి సినిమాలు నచ్చుతున్నాయి. తన ప్రతి సినిమాలో కామెడీ ప్రధానంగా తెరకెక్కిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్న అనిల్. ఇటీవలే మరో సినిమా కథను తయారుచేయడం లో లీనమయ్యాడట.

గతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా, మెహరీన్ లను హీరోయిన్లుగా పెట్టి రూపొందించిన చిత్రం 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. ఇప్పుడు కథ రాయడానికి వైజాగ్ చేరాడట. వైజాగ్ తనకు కథలు రాసుకోవడానికి లక్కీ ప్లేస్ గా భావిస్తాడట అనిల్. అయితే తను ప్రస్తుతం రాస్తున్న కథ 'ఎఫ్3' మూవీదేనని సమాచారం. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ సినిమాకు సీక్వెల్ తీసినా సరిగ్గా ఆడవు అనేది ఆనవాయితీగా నిరూపిస్తున్నారు ప్రేక్షకులు. మరి 'ఎఫ్3' మీద కూడా సినీ ఇండస్ట్రీలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీక్వెల్ అని రిస్క్ తీసుకోకుండా చక్కగా వేరే కథ రాసుకుంటే బాగుంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి అనిల్.. ఎలాంటి కథతో ముందుకు రాబోతున్నాడో..