Begin typing your search above and press return to search.

'ఎఫ్‌-3'లో 'ఎఫ్‌-2' మెంబెర్స్ కి చోటులేదా..?

By:  Tupaki Desk   |   7 April 2020 11:30 AM GMT
ఎఫ్‌-3లో ఎఫ్‌-2 మెంబెర్స్ కి చోటులేదా..?
X
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రం ద్వారా అసలు సిసలైన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించడం ఈ డైరెక్టర్ స్టైల్. తన మొదటి సినిమా 'పటాస్‌' నుంచి 'సరిలేరు నీకెవ్వరు' వరకూ వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి అపజయం అంటే ఎరుగని సక్సెఫుల్ దర్శకుడిగా గుర్తింపు పొందాడు. గ‌త ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం 'ఎఫ్‌2'. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. త‌మ‌న్నా - మెహ‌రీన్ హీరోయిన్‌ లుగా న‌టించిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్‌ గా వంద కోట్లు వ‌సూలు చేసి శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా ఎండింగ్‌లోనూ సీక్వెల్ ప్లాన్స్ వున్న‌ట్టు హింట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అదే ప‌నిలో బిజీగా వున్నాడు.

ఇటీవ‌ల 'స‌రిలేరు నీకెవ్వ‌రు' స‌మ‌యంలో మీడియా ఇంట‌రాక్ష‌న్‌ లో త్వ‌ర‌లో సీక్వెల్ ని చేయ‌బోతున్నాన‌ని క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ ని సిద్ధం చేసే ప‌నిలో బిజీగా వున్నాడు. ఈ సీక్వెల్‌లో వెంక‌టేష్‌ -వ‌రుణ్ తేజ్‌ ల‌కు మాత్రమే జోటు క‌ల్పించిన డైరెక్టర్ హీరోయిన్‌ లు త‌మ‌న్నా - మెహ‌రీన్‌ ల‌కు మాత్రం ఇందులో చోటు క‌ల్పించ‌డం లేద‌ట‌. వీరిద్ద‌రి స్థానంలో వేరే హీరోయిన్‌ ల‌ని తీసుకోవాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. అంతే కాకుండా ఫ‌స్ట్ పార్ట్‌ కి మించి మూవీని మ‌రింత గ్లామ‌ర‌స్‌ గా రెడీ చేస్తున్నాడ‌ట‌. అందుకు కొత్త వాళ్లైతేనే బాగుంటుంద‌ని భావించిన అనిల్ రావిపూడి ఈ నిర్ణయం తీసుకుంటున్నాడట. ఈ సీక్వెల్‌ ని కూడా దిల్ రాజే నిర్మిస్తార‌ట‌. ప్రజెంట్ వెంకీ ‘నారప్ప’తో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆగష్టు సమయానికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయట. దిల్ రాజు - అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ని ఆగష్టు నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచన లో ఉన్నారట. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.