Begin typing your search above and press return to search.
`వకీల్ సాబ్` బ్యూటీ అక్కడ పాగా వేస్తోంది
By: Tupaki Desk | 16 Feb 2022 3:30 AM GMTతెలుగులో సక్సెస్ అయిన హీరోయిన్ లు ఇతర భాషల్లో ప్రయత్నాలు చేస్తూ అక్కడ కూడా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇప్పడు అదే బాటలో `వకీల్ సాబ్` బ్యూటీ పయనిస్తోంది.
అయితే సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేస్తూ సడన్ షాకివ్వబోతోంది. వివరాల్లోకి వెళితే... ఆసు యంత్రాన్ని సృష్టించి వార్తల్లో నిలిచిన చింత కింది మల్లెశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం `మల్లెశం`. ప్రియదర్శి టైటిల్ పాత్రలో నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
ఇదే చిత్రం ద్వారా పరిచయమైంది అననన్య నాగళ్ల. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన అనన్య తొలి చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత `ప్లేబ్యాక్` మూవీలో నటించినా పాపులారిటీని సొంతం చేసుకుంది మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్` చిత్రంతోనే.
ఇందులో కథకు కీలకంగా నిలిచిన పాత్రల్లో అంజలి, నివేదా థామస్ లతో కలిసి నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తరువాత తనకు క్రేజీ ఆఫర్లు వస్తాయని ఎదురుచూసింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకు ముందే అంగీకరించిన `మాస్ట్రో`లో ప్రాధాన్యత లేని పాత్రలో నటించాల్సి వచ్చింది.
సమంత తో గుణ్శేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం `శాకుంతలం`లో ప్రాధాన్యత వున్న పాత్రలో మెరిసిందట. అయినా ఈ మూవీ తరువాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం.. తెలుగులో తన చేతిలో మరో సినిమా లేకపోవడంతో అనన్య కన్ను ఇప్పుడు కోలీవుడ్ పై పడింది.
సైలెంట్ గా ఓ సినిమాని పట్టేసింది అనన్య నాగళ్ల. తను కోలీవుడ్ కు పరిచయం అవుతున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. శశి కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. తంగం పా సరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు వెళ్లి అక్కడ సక్సెస్ అయిన అంజలి, బిందు మాధవి, ఆనంది, శ్రీదివ్య తరహాలో అనన్య నాగళ్ల కూడా సక్సెస్ అయి వరుస ఆఫర్లని దక్కించుకుంటుదేమో చూడాలి.
అయితే సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చేస్తూ సడన్ షాకివ్వబోతోంది. వివరాల్లోకి వెళితే... ఆసు యంత్రాన్ని సృష్టించి వార్తల్లో నిలిచిన చింత కింది మల్లెశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం `మల్లెశం`. ప్రియదర్శి టైటిల్ పాత్రలో నటించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది.
ఇదే చిత్రం ద్వారా పరిచయమైంది అననన్య నాగళ్ల. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లికి చెందిన అనన్య తొలి చిత్రంతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. తరువాత `ప్లేబ్యాక్` మూవీలో నటించినా పాపులారిటీని సొంతం చేసుకుంది మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `వకీల్ సాబ్` చిత్రంతోనే.
ఇందులో కథకు కీలకంగా నిలిచిన పాత్రల్లో అంజలి, నివేదా థామస్ లతో కలిసి నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో తరువాత తనకు క్రేజీ ఆఫర్లు వస్తాయని ఎదురుచూసింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకు ముందే అంగీకరించిన `మాస్ట్రో`లో ప్రాధాన్యత లేని పాత్రలో నటించాల్సి వచ్చింది.
సమంత తో గుణ్శేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం `శాకుంతలం`లో ప్రాధాన్యత వున్న పాత్రలో మెరిసిందట. అయినా ఈ మూవీ తరువాత తనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం.. తెలుగులో తన చేతిలో మరో సినిమా లేకపోవడంతో అనన్య కన్ను ఇప్పుడు కోలీవుడ్ పై పడింది.
సైలెంట్ గా ఓ సినిమాని పట్టేసింది అనన్య నాగళ్ల. తను కోలీవుడ్ కు పరిచయం అవుతున్న తాజా చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. శశి కుమార్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. తంగం పా సరవణన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కు వెళ్లి అక్కడ సక్సెస్ అయిన అంజలి, బిందు మాధవి, ఆనంది, శ్రీదివ్య తరహాలో అనన్య నాగళ్ల కూడా సక్సెస్ అయి వరుస ఆఫర్లని దక్కించుకుంటుదేమో చూడాలి.