Begin typing your search above and press return to search.

మహేష్ సినిమా.. చూడకుండా ఎలా ఉన్నాను: ఆనంద్ మహీంద్రా

By:  Tupaki Desk   |   30 May 2022 10:30 AM GMT
మహేష్ సినిమా.. చూడకుండా ఎలా ఉన్నాను: ఆనంద్ మహీంద్రా
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంది. ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

అయితే ఈ సినిమాపై కొంతమంది ప్రముఖులు కూడా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండటం విశేషం. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా మహేష్ బాబు సినిమా పై తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు.. సర్కారు వారి పాట సినిమాలో జావా మెరూన్ ను ఎక్కువగా డ్రైవ్ చేశాడు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. అలాగే జావా మెరూన్ బైక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ వ్యవస్థాపకురాలు అనుపమ థరేజా తన ఆనందాన్ని పంచుకోవడానికి ట్విట్ చేయగా.. ఈ ట్వీట్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది.

"నేను మహేష్, జావా యొక్క అజేయమైన కలయికను చూడకుండా ఎలా ఉండగలను? నేను న్యూయార్క్‌లో ఉన్నాను. ఇక న్యూజెర్సీకి వెళతాను, అక్కడ ఈ సినిమా ప్రదర్శించబడుతోంది "అని ఆనంద్ మహీంద్రా మునుపటి ట్వీట్‌ను ఉటంకిస్తూ రాశారు. ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేయగానే సోషల్ మీడియాలో ట్వీట్ మరింత వైరల్ గా మారిపోయింది.

మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై విభిన్నంగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సముద్రఖని ప్రతినాయకుడిగా కనిపించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఇప్పటికే రెండు వందల కోట్ల వరకు కలెక్షన్స్ సాధించినట్లు నిర్మాతలు చెబుతున్నారు. మరి మొత్తంగా సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.