Begin typing your search above and press return to search.

సౌత్‌ నార్త్‌ కలవడం కష్టం -అల్లు హీరో

By:  Tupaki Desk   |   25 Jan 2016 3:30 PM GMT
సౌత్‌ నార్త్‌ కలవడం కష్టం -అల్లు హీరో
X
గత రాత్రి జరిగిన ఐఫా అవార్డుల్లో.. అసలు మెయిన్‌ రోల్‌ అల్లు శిరీష్‌ దే అని ఒక టాక్‌ ఉంది. మనోడు ఈ అవార్డుల వారిని ఇక్కడ తీసుకొచ్చాడట. గతంలో సౌత్‌ స్కోప్‌ మ్యాగజైన్‌ రన్‌ చేసిన శిరీష్‌.. అప్పటి నుండీ ఐఫాతో ఫుల్‌ క్లోజ్‌. ఆ విధంగా ఐఫా ఉత్సవ్‌ అని ఏర్పాటు చేయించి.. తెలుగు తమిళ - కన్నడ - మలయాళం సినిమా వాళ్ళకు ఇలా అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టించాడట.

దీని గురించి అడిగితే.. నాదేముందండీ.. మన చీఫ్‌ మినిష్టర్‌ కెసిఆర్‌ గారొ చొరవతో ఐఫా ఉత్సవ్‌ హైదరాబాద్‌ వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో అసలు బాలీవుడ్‌ అవార్డులతో పాటే కలిపి తెలుగు అవార్డులు కూడా ఇవ్వొచ్చుగా అంటే.. ఇలా చెప్పుకొచ్చాడు గురుడు..

''అసలు ఇండియాలో 7-8 ఇండస్ర్టీలు ఉన్నాయి. వీళ్లందరికీ దాదాపు ఒక 70-80 అవార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం షుమారు ఒక 10 గంటలు టైమ్‌ కావాలి. సో.. బాలీవుడ్‌ తో పాటు.. మన తెలుగు - తమిళం - మలయాళం - బెంగాళ్‌ - మరాఠి.. ఇలా అన్నీ కలిపి ఒకేచోట అవార్డులు ఇవ్వాలంటే చాలా కష్టం. అందుకే సౌత్‌ నార్త్‌ కలిపి ఈవెంట్‌ చేయలేం. ప్రాక్టికల్‌ పాజిబిలిటీ ఉండదు. అందుకే మన అవార్డులను మనమే చేసుకుంటే బెటర్‌'' అంటున్నాడు అల్లు శిరీష్‌.

ప్రస్తుతం పరశురాం డైరక్షన్‌ లో ఒక సినిమాను చేస్తున్నాడు శిరీష్‌. ఆడియన్స్‌ ఎలాంటి సినిమాలు చూడ్డానికి ఇష్టపడుతున్నారో అలాంటి సినిమాలే చేస్తున్నాడట.