Begin typing your search above and press return to search.
యువహీరో `జీవితమే తలకిందులు`..ప్చ్!!
By: Tupaki Desk | 11 May 2020 8:30 AM GMTఅల్లు వారసుడు అల్లు శిరీష్ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. వరుసగా ప్రయోగాలు చేస్తున్నా.. స్క్రిప్టు.. దర్శకుడి ఎంపిక పరంగా జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటున్నా ఆశించిన ఆ ఒక్క హిట్టు దక్కడం లేదు. కొన్ని వరుస ఫ్లాపులతో పూర్తిగా డీలా పడిపోయిన శిరీష్.. ఇంకా పట్టువదలని విక్రమార్కుడిలా గెలుపు కోసం పోరాడుతున్నాడు.
ప్రస్తుతం కరనా లాక్ డౌన్ విరామ సమయంలో శిరీష్ పూర్తిగా సొంత ఓటీటీ సంస్థ ఆహా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడని.. అల్లు బాస్ అరవింద్ బాటలోనే నిర్మాతగా కొత్త జర్నీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ప్రచారమైంది. అందుకు సింబాలిక్ గానా? అన్నట్టు తాజాగా శిరీష్ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు.
ఇన్ స్టాలో తాజాగా చక్రాసనం వేసిన ఫోటోని షేర్ చేశాడు. దానికి ``జీవితం తలక్రిందులైంది.. నేను కూడా ఇలానే ఉండాలని అనుకున్నాను!`` అని కొంటెగా కామెంట్ ని పెట్టాడు. నేను జీవితంలో బిజీగా ఉన్నందున యోగాతో సంబంధాన్ని కోల్పోయాను. కాని లాక్ డౌన్ దానిపై నా ఆసక్తిని పెంచింది అని అన్నాడు. ``జీవితం ఇలా ఆగిపోయినప్పుడు`` అంటూ ఇంతకుముందు వేరొక ఫోటోని సోషల్ మీడియాలో శిరీష్ చేసాడు. ఈ రెండు ఫోటోల పైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
శిరీష్ నటించిన చివరి తెలుగు చిత్రం `ఎబిసి-అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ`. ఆ తర్వాత వరుసగా స్క్రిప్టుల్ని ఎంపిక చేశాడు. అవన్నీ సెట్స్ పైకి వెళతాయని కూడా హింట్ ఇచ్చాడు. వాటికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చే లోగానే కరోనా పంచ్ అతడి పైనా పడింది మరి.
ప్రస్తుతం కరనా లాక్ డౌన్ విరామ సమయంలో శిరీష్ పూర్తిగా సొంత ఓటీటీ సంస్థ ఆహా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడని.. అల్లు బాస్ అరవింద్ బాటలోనే నిర్మాతగా కొత్త జర్నీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని ప్రచారమైంది. అందుకు సింబాలిక్ గానా? అన్నట్టు తాజాగా శిరీష్ తనపై తానే సెటైర్లు వేసుకున్నాడు.
ఇన్ స్టాలో తాజాగా చక్రాసనం వేసిన ఫోటోని షేర్ చేశాడు. దానికి ``జీవితం తలక్రిందులైంది.. నేను కూడా ఇలానే ఉండాలని అనుకున్నాను!`` అని కొంటెగా కామెంట్ ని పెట్టాడు. నేను జీవితంలో బిజీగా ఉన్నందున యోగాతో సంబంధాన్ని కోల్పోయాను. కాని లాక్ డౌన్ దానిపై నా ఆసక్తిని పెంచింది అని అన్నాడు. ``జీవితం ఇలా ఆగిపోయినప్పుడు`` అంటూ ఇంతకుముందు వేరొక ఫోటోని సోషల్ మీడియాలో శిరీష్ చేసాడు. ఈ రెండు ఫోటోల పైనా అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
శిరీష్ నటించిన చివరి తెలుగు చిత్రం `ఎబిసి-అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ`. ఆ తర్వాత వరుసగా స్క్రిప్టుల్ని ఎంపిక చేశాడు. అవన్నీ సెట్స్ పైకి వెళతాయని కూడా హింట్ ఇచ్చాడు. వాటికి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ వచ్చే లోగానే కరోనా పంచ్ అతడి పైనా పడింది మరి.