Begin typing your search above and press return to search.

రజనీ బాటలో బన్నీ .. రెమ్యూనరేషన్‌ పెంచాడు

By:  Tupaki Desk   |   23 March 2020 5:15 AM GMT
రజనీ బాటలో బన్నీ .. రెమ్యూనరేషన్‌ పెంచాడు
X
అల్లు అర్జున్‌ ఇప్పుడు టాలీవుడ్‌ లో అత్యంత క్రేజీయెస్ట్ హీరో. `అల వైకుంఠపురములో`లో భారీ బ్లాక్‌ బస్టర్‌ సాధించడంతో ఆయనకు విశేషమైన క్రేజ్‌ వచ్చింది. ఆ క్రేజ్‌ ని క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు ఈ దువ్వాడ జగన్నాథమ్‌. తాజాగా రెమ్యూనరేషన్‌ పెంచేశాడు. తన పారితోషికాన్ని డబుల్‌చేశాడట. ప్రస్తుతం బన్నీ రూ.15కోట్లు తీసుకుంటున్నాడు. ఇకపై దాన్ని రెట్టింపు చేసి ...ఏకంగా రూ. 30కోట్లు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రెమ్యూనరేషన్‌ పరంగా రజనీకాంత్‌ దాదాపు వందకోట్లు వసూలు చేస్తున్నారు. అలాగే కమల్‌ హాసన్‌ దాదాపు యాభై కోట్లు తీసుకుంటారు. మహేష్‌ బాబు ముప్పైకోట్లు,... పవన్‌ 25 నుంచి 30కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. తాజా తన రెమ్యూనరేషన్‌ హైక్‌ చేసి వారి జాబితాలో బన్నీ కూడా చేరిపోయారు.

ప్రస్తుతం ఈ ఆర్య హీరో సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. `ఆర్య`, `ఆర్య2` తర్వాత వీరి కాంబినేషన్‌ లో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్‌ యెర్నేని - రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గందపు చెక్కల స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో బన్నీ చాలా మాస్‌ లుక్‌ లో, ... డీ గ్లామర్‌ గా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని `అల వైకుంఠపురములో` టైమ్‌ లోనే ఓకే చేశాడు. మరి ఈ సినిమాకి రెమ్యూనరేష్‌ పెంచుతాడా.... లేక పాతదే కంటిన్యూ చేస్తాడా అన్నది సస్పెన్స్ గా మారింది.

ఇప్పుడు బన్నీకి ఉన్న క్రేజ్‌, `అల వైకుంఠపురములో`తో ఏర్పడిన మార్కెట్‌ ని... సుకుమార్‌ గతంలో తీసిన`రంగస్థలం` సక్సెస్‌ ని... బన్నీ సుకుమార్‌ కాంబినేషన్‌ కి ఉన్న క్రేజ్‌ ని దృష్టిలో పెట్టుకుని...., బన్నీ డిమాండ్‌ చేసే రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు మైత్రీ మూవీస్‌ సిద్ధంగానే ఉందని టాక్‌.