Begin typing your search above and press return to search.
చిరు వేదిక మార్పునకు కారణమేంటో!
By: Tupaki Desk | 4 Jan 2017 9:56 AM GMTవిషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే చాలా కష్టమేనన్నట్టుంది... అల్లూ అరవింద్ వ్యవహారం. అయినా తెలిసిన విషయాన్ని చెప్పేందుకంటూ మీడియా ముందుకు వచ్చినట్లుగా ఓ ఫోజ్ పెట్టేసి... ఆ తర్వాత అసలు విషయాన్ని మెగాస్టార్ చిరంజీవే వెల్లడిస్తారని - అప్పటిదాకా మెగాస్టార్ అభిమానులు ఓపిక పట్టాలని ఆయన చావు కబురు చల్లగా చెప్పేశారు. అయినా అసలు విషయం చెప్పకుండా.. ఈ సుత్తి ఏమాటనేగా? సరే విషయంలోకి వెళితే... మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన ఖైదీ నెంః150 చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తన రీ ఎంట్రీని అదిరిపోయేలా ఉండాలని భావిస్తున్న ఈ ఫంక్షన్ ను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని చిరు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా విజయవాడలో ఈ నెల 4న సదరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్న వేళ... ఉన్నట్టుండి మెగాస్టార్ అభిమానులకు పిడుగు లాంటి వార్త వినిపించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికను ఇందిరాగాంధీ స్టేడియం నుంచే కాకుండా విజయవాడ నుంచి కూడా షిఫ్ట్ చేసినట్లుగానే కాకుండా... కార్యక్రమాన్ని ఈ నెల 7కు వాయిదా వేస్తున్నట్లు వచ్చేసిన ఆ వార్త నిజంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కు షాకిచ్చిందనే చెప్పాలి. విజయవాడలో 4న నిర్వహించాలని భావించిన ఫంక్షన్ కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పుకార్లు వినిపించాయి. దీనిపై చిత్ర బృందం ఏ మాటా చెప్పకపోవడంతో మూడు రోజులుగా మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా... నిజంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని - చిరుపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందనీ భావించారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ను ఊరడిద్దామని మీడియా ముందుకు వచ్చిన అల్లూ అరవింద్... ఫంక్షన్ కు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్న మాటలో వాస్తవం లేదని, వేదిక - తేదీ మార్పునకు వేరే కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ కారణాలేంటో మాత్రం ఆయన వివరించకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఫ్యాన్స్ ను మరింత అయోమయానికి గురి చేసేలా... ఆ కారణాలేంటో స్వయంగా చిరంజీవే వెల్లడిస్తారని కూడా ఆయన ఓ ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా 7న విజయవాడకు కాస్తంత దూరంలో గుంటూరు జిల్లా పరిధిలోని హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఆ కారణాలను చిరు వెల్లడిస్తారని చెప్పిన ఆయన ఫ్యాన్స్లో మరింత గందరగోళం పెంచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
ఇందులో భాగంగా విజయవాడలో ఈ నెల 4న సదరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయం తీసేసుకున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్న వేళ... ఉన్నట్టుండి మెగాస్టార్ అభిమానులకు పిడుగు లాంటి వార్త వినిపించింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికను ఇందిరాగాంధీ స్టేడియం నుంచే కాకుండా విజయవాడ నుంచి కూడా షిఫ్ట్ చేసినట్లుగానే కాకుండా... కార్యక్రమాన్ని ఈ నెల 7కు వాయిదా వేస్తున్నట్లు వచ్చేసిన ఆ వార్త నిజంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కు షాకిచ్చిందనే చెప్పాలి. విజయవాడలో 4న నిర్వహించాలని భావించిన ఫంక్షన్ కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పుకార్లు వినిపించాయి. దీనిపై చిత్ర బృందం ఏ మాటా చెప్పకపోవడంతో మూడు రోజులుగా మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా... నిజంగానే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని - చిరుపై కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందనీ భావించారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ ను ఊరడిద్దామని మీడియా ముందుకు వచ్చిన అల్లూ అరవింద్... ఫంక్షన్ కు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదన్న మాటలో వాస్తవం లేదని, వేదిక - తేదీ మార్పునకు వేరే కారణాలున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఆ కారణాలేంటో మాత్రం ఆయన వివరించకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఫ్యాన్స్ ను మరింత అయోమయానికి గురి చేసేలా... ఆ కారణాలేంటో స్వయంగా చిరంజీవే వెల్లడిస్తారని కూడా ఆయన ఓ ట్విస్ట్ ఇచ్చారు. అది కూడా 7న విజయవాడకు కాస్తంత దూరంలో గుంటూరు జిల్లా పరిధిలోని హాయ్ ల్యాండ్ రిసార్ట్ లో జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోనే ఆ కారణాలను చిరు వెల్లడిస్తారని చెప్పిన ఆయన ఫ్యాన్స్లో మరింత గందరగోళం పెంచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/