Begin typing your search above and press return to search.
అల్లు అరవింద్ కీలక మీటింగ్?
By: Tupaki Desk | 6 Feb 2023 1:44 PM GMTఅల్లు ఆయన ఇంటి పేరు. హాస్యానికి మారుపేరైనా అల్లు రామలింగయ్య తనయుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల్లో సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు అల్లు అరవింద్. ఈయన ఒకప్పుడు ‘మెగా కాంపౌండ్ కు పునాది! ఇప్పుడు తమ కాంపౌండ్ హీరోలతో పాటు పలువురు కథానాయకులతో 'గీతా ఆర్ట్స్'‘ పతాకంపై అభిరుచి గల చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి వచ్చిన పలు భారీ హిట్లను అందుకున్నాయి. కొంతకాలం క్రితం ఓటీటీలోకి కూడా అడుగుపెట్టి ఆహా పేరుతో ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించారు. కాలానుగుణంగా ప్రణాళికలు రచిస్తూ సక్సెస్ ను తన పక్కన పెట్టుకుని అన్స్టాపబుల్ గా దూసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలంటే వర్ధమాన నిర్మాతలకు ఓ రోల్ మోడల్ గా మారారు.
అయితే ఆయన చిత్రాలను నిర్మించడంతో పాటు చిత్రసీమలో ఎలాంటి పాత్ర పోషిస్తారో కూడా తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ కీలక మీటింగ్ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రమే ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఓ కీలక అంశంపై మాట్లాడనున్నారని సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయం సస్పెన్స్ గానే ఉంది. అసలు అదేంటనేది ఇది రివీల్ కానుంది. ఈ విషయం బయటకు తెలిసినప్పటి నుంచి ఈ మీటింగ్ ఏంటనేది ప్రస్తుతం చిత్రసీమలో హాట్టాపిక్ గా మారింది.
ఇక మరికొంత మంది బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి అంటున్నారు. అందులో బాలయ్య నర్సులపై చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ మాట్లాడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ కూడా నర్సుల సంఘానికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంపై కాకపోవచ్చని కూడా సిని వర్గల్లో టాక్.
ఇక గీతా ఆర్ట్స్ విషయానికొస్తే.. అల్లు అరవింద్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ విజయ యాత్రను కొనసాగిస్తుంది.
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయింది. ప్రస్తుతం అల్లుఅరవింద్ ఆహా మెయిన్టెయిన్స్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన కోప్రొడ్యూసర్గా వ్యవహరించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ రిలీజ్కు రెడీ అయింది. ఇందులో కృతిసనన్, కార్తీక్ ఆర్యన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాకపోతే ప్రస్తుతం ఆ చిత్రం విడుదల విషయంలో వివాదాల్ని ఎదుర్కొంటోంది.
ఇక తెలుగులో అల్లు అరవింద్ ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించిన అల్లు అరవింద్.. మరోసారి హిట్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. మురళి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక అల్లు అరవింద్ దేనిగురించి మీటింగ్ పెట్టనున్నారో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
అయితే ఆయన చిత్రాలను నిర్మించడంతో పాటు చిత్రసీమలో ఎలాంటి పాత్ర పోషిస్తారో కూడా తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఓ కీలక మీటింగ్ను ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రమే ఓ ప్రెస్ మీట్ పెట్టి.. ఓ కీలక అంశంపై మాట్లాడనున్నారని సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయం సస్పెన్స్ గానే ఉంది. అసలు అదేంటనేది ఇది రివీల్ కానుంది. ఈ విషయం బయటకు తెలిసినప్పటి నుంచి ఈ మీటింగ్ ఏంటనేది ప్రస్తుతం చిత్రసీమలో హాట్టాపిక్ గా మారింది.
ఇక మరికొంత మంది బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో గురించి అంటున్నారు. అందులో బాలయ్య నర్సులపై చేసిన వ్యాఖ్యలపై అల్లు అరవింద్ మాట్లాడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ కూడా నర్సుల సంఘానికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ విషయంపై కాకపోవచ్చని కూడా సిని వర్గల్లో టాక్.
ఇక గీతా ఆర్ట్స్ విషయానికొస్తే.. అల్లు అరవింద్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ ఐదు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా కొనసాగుతుంది. కేవలం నిర్మాణ రంగంలో మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ విజయ యాత్రను కొనసాగిస్తుంది.
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా పలు సినిమాలు నిర్మించి సక్సెస్ అయింది. ప్రస్తుతం అల్లుఅరవింద్ ఆహా మెయిన్టెయిన్స్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఆయన కోప్రొడ్యూసర్గా వ్యవహరించిన అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ రిలీజ్కు రెడీ అయింది. ఇందులో కృతిసనన్, కార్తీక్ ఆర్యన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాకపోతే ప్రస్తుతం ఆ చిత్రం విడుదల విషయంలో వివాదాల్ని ఎదుర్కొంటోంది.
ఇక తెలుగులో అల్లు అరవింద్ ప్రస్తుతం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించిన అల్లు అరవింద్.. మరోసారి హిట్ కొట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు. మురళి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు ఆకట్టుకుంటున్నాయి. ఇక అల్లు అరవింద్ దేనిగురించి మీటింగ్ పెట్టనున్నారో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.