Begin typing your search above and press return to search.

వాళ్ళ బ్రేక్ అప్ నిజమేనా!

By:  Tupaki Desk   |   21 March 2020 8:40 AM GMT
వాళ్ళ బ్రేక్ అప్ నిజమేనా!
X
బాలీవుడ్ సూపర్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య బీటౌన్ లో వీళ్ళిద్దరూ విడిపోయారనే వార్త ఇప్పుడు షికారు చేస్తోంది. ఈ పుకారు పుట్టడానికి కారణాలు లేకపోలేదు. కొన్ని రోజుల క్రితం అలియా భట్ తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ హాజరైన ఈ వేడుకకి రణబీర్ కపూర్ హాజరు కాకపోవడమే ఈ వార్తకి బలాన్ని చేకూర్చింది. ఈ వేడుకలో రణబీర్ కనిపించకపోవడంతో ఈ స్టార్ కపుల్ మధ్య విభేదాలు వచ్చాయనే పుకార్లకు దారితీసింది. రణబీర్ కపూర్, అలియా భట్ బ్రేక్ అప్ చేసుకున్నారనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాకుండా మరికొంత మంది రణబీర్ బ్రేక్ అప్ చెప్పడం మొదటిసారి కాదుగా అని, కత్రినా దీపికాలతో చేసిందేగా అని విమర్శిస్తున్నారంట. ఈ వార్త విన్న వీరి అభిమానులు బాగా కలత చెందుతున్నారంట.

ఇదిలా ఉండగా ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన అలియా భట్ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఆ జర్నలిస్ట్ రణబీర్ తో బ్రేక్ అప్ గురించి అడిగినప్పుడు 'ఓహ్ షిట్' అంటూ నవ్వుతూ ఈ పుకార్లకు ముగింపు పలికిందంట. అయితే నిజానికి రణబీర్.. అనారోగ్యం నుండి కోలుకుంటున్న తన తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూలతో సమయం గడపడానికి అలియా పుట్టిన రోజు వేడుకలకు హాజరు కాలేదంట.