Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న డస్కీ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   4 Sep 2020 2:30 AM GMT
టాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న డస్కీ బ్యూటీ...!
X
కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటుడు రాజేష్‌ కుమార్తె.. హాస్యనటి శ్రీలక్ష్మి మేనకోడలు. తెలుగు మూలాలున్న ఐశ్వర్య ముందుగా పలు డబ్బింగ్ సినిమాతో పలకరించింది. ఆ తర్వాత 'కౌసల్య కృష్ణమూర్తి' అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. దీంతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలోనూ మెరిసింది. తమిళంలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ స్టేటస్ పొందిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో మాత్రం క్రేజీ హీరోయిన్ గా మారలేకపోయింది. చేసిన రెండు సినిమాలు పరాజయం చవి చూడటంతో ఇక్కడ పెద్ద‌గా ఆఫ‌ర్స్ రాలేదు. అయితే ఈ నేచురల్ బ్యూటీకి నేచురల్ స్టార్ నాని పక్కన నటించే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. నాని నటిస్తున్న 'టక్ జగదీష్' సినిమాలో అమ్మడు కూడా ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

కాగా, తమిళ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వ‌ర్య రాజేశ్ ఇప్పుడు టాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాలని చూస్తోందట. దీని కోసం హాట్ హాట్ ఫోజుల‌తో ఫొటో షూట్స్ చేస్తూ అగ్ర నిర్మాత‌లంద‌రికీ త‌న పోర్ట్ ఫోలీయోలు పంప‌డం మొద‌లు పెట్టంద‌ని సమాచారం. ఎలాగైనా ఇక్కడ పాగా వేసి సాయి ప‌ల్లవి వలె గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడుతోందట. అందుకే సాయి ప‌ల్లివి మాదిరిగా తెలంగాణ యాస కూడా నేర్చుకుంద‌ని కాస్టింగ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మరి టాలీవుడ్ లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కి ఏమాత్రం అవకాశాలు దక్కుతాయో చూడాలి. ఐశ్వర్య ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి 'కా.పే.రణసింగమ్‌' మరియు 'ఇదమ్ పోరుల్ యవాల్' అనే సినిమాలలో నటిస్తోంది. వీటితో పాటు 'భూమిక' 'తిట్టమ్ ఇరండు' 'ఇదు వేదలమ్ సొల్లుమ్ కాదై' అనే తమిళ్ సినిమాల్లో నటిస్తోంది.