Begin typing your search above and press return to search.

మరో పాన్ ఇండియాకు పూరీ కథ సిద్ధం!

By:  Tupaki Desk   |   20 May 2020 3:45 AM GMT
మరో పాన్ ఇండియాకు పూరీ కథ సిద్ధం!
X
కరోనా వైరస్ తెలుగు సినీ ఇండస్ట్రీని భారీ దెబ్బతీసింది. లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం మాటను ఖాతరు చేస్తూ సినీ దర్శక నిర్మాతలు సినిమా షూటింగ్స్ నిలిపేశారు. అలా షూటింగ్ నిలుపుకొని ఇంట్లో ఉన్నవారిలో పూరి జగన్నాధ్ కూడా ఒకరు. ముంబైలో తన ఫైటర్ యొక్క ప్రధాన షెడ్యూల్ పూర్తి చేసి, లాక్ డౌన్ విధించే సమయానికి హైదరాబాద్ చేరుకున్నారు. లాక్ డౌన్ తర్వాత ఫైటర్ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేస్తామని కూడా తెలిపారు. పూరీ జగన్నాథ్ తెలివిగా లాక్ డౌన్ టైంని ఫుల్ గా వినియోగించుకున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాధ్ తన నెక్స్ట్ సినిమా కోసం స్క్రిప్ట్ రాస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో తదుపరి సినిమాకోసం స్క్రిప్ట్ రాసాడట. అయితే దానికి హీరో ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.

ఆ మధ్య ఫిల్మ్‌నగర్‌లో పూరీ స్క్రిప్ట్ రైటింగ్ గురించి ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ రాసిన స్క్రిప్ట్ మెగాస్టార్ చిరంజీవి కోసమేనని ఫిల్మ్ నగర్ కోడై కూసింది. కానీ పూరీ తదుపరి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందట. ఆ కథ పూర్తిస్థాయిలో సిద్ధమైందట. ఇటీవల దర్శకులంతా కథలు సిద్ధం చేసుకొని, వాటిని వీడియో కాల్‌ ద్వారా హీరోలకు కథలు వినిపించి ఓకే చేసుకుంటున్నారు. మరి త్వరలోనే పూరి కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఆ సినిమాలో అందులో ఓ స్టార్ హీరో నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ చేస్తుండగా.. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాతో అనన్య తెలుగు తెరకి పరిచయం కానుంది. అయితే ఈ సినిమా పూరీ కనెక్ట్స్ అండ్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతుంది.