Begin typing your search above and press return to search.

మిస్ ఇండియాను పట్టుకొస్తున్న పూరీ

By:  Tupaki Desk   |   21 April 2016 3:55 AM GMT
మిస్ ఇండియాను పట్టుకొస్తున్న పూరీ
X
టాలీవుడ్ కి కొత్త హీరోయిన్లను పట్టుకురావడంలో పూరీ జగన్నాథ్ కి బోలెడు పేరుంది. పూరీ ఇంట్రడ్యూస్ చేశాడంటే.. ఆ భామకి బోలెడంత ఫ్యూచర్ ఉన్నట్లే అని ఇండస్ట్రీ డిసైడ్ అయిపోతుంది. అందుకే పూరీ సినిమా కంప్లీట్ కాకుండానే కొత్త ఆఫర్స్ కూడా వచ్చేస్తుంటాయి. ఇలా పూరీ పరిచయం చేసిన వాళ్లలో రక్షిత - హన్నిక - దిశా పటానీ - ఆదా శర్మ.. ఇలా బోలెడంత లిస్ట్ ఉంటుంది.

ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించనున్న చిత్రం కోసం ఓ కొత్త హీరోయిన్ ని తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. ఆమె ఎవరో కాదు.. మిస్ ఇండియా 2015గా ఎంపికైన అదితి ఆర్య. ఇప్పటికే ఈమెకు స్క్రిప్ట్ కూడా వినిపించారని.. కళ్యాణ్ రామ్ సరసన నటించేందుకు.. అదితి ఒప్పుకుందని తెలుస్తోంది.

రీసెంట్ గా హైద్రాబాద్ వచ్చి ఓ ఫోటో షూట్ కూడా చేసిందట అదితిఆర్య. అన్నీ సెట్ అయితే.. పూరీ ఓ కొత్త పోరీని తెచ్చేసినట్లే. ఈ మూవీని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తుండగా.. ప్రస్తుతం ఇషాన్ తో చేస్తున్న రోగ్ కంప్లీట్ కాగానే కళ్యాణ్ రామ్ మూవీని స్టార్ట్ చేయనున్నాడు పూరీ జగన్నాధ్.