Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' షూటింగ్ లాస్ట్‌ అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   26 Oct 2021 6:22 AM GMT
ఆదిపురుష్‌ షూటింగ్ లాస్ట్‌ అప్‌డేట్‌
X
ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఓమ్‌ రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆదిపురుష్‌. బాలీవుడ్‌ లో ప్రభాస్ చేస్తున్న మొదటి డైరెక్ట్‌ సినిమా ఇది. రామాయణ ఇతి వృత్యం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో హాలీవుడ్‌ రేంజ్ టెక్నాలజీని ఉపయోగించి తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు రామాయణంను ఎన్నో సార్లు చూడటం జరిగింది. కాని ఈ రామాయణం మాత్రం చాలా స్పెషల్‌ గా ఓమ్‌ రౌత్‌ తెరకెక్కిస్తున్నాడు అంటున్నారు. ప్రభాస్‌ ను రాముడిగా చూపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కాని పోస్టర్‌ ను లేదా కనీసం లుక్ ను కూడా రివీల్‌ చేయలేదు. అసలు ప్రభాస్ రెగ్యులర్‌ రాముడి లుక్‌ లో భాణం పట్టుకుని నీల వర్ణంలో ఉంటాడా అంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్రధాన పాత్రలో నటిస్తున్న సైఫ్‌ అలీ ఖాన్‌ మరియు హీరోయిన్‌ గా నటిస్తున్న కృతి శెట్టి లు షూటింగ్ ను ముగించేశారు. ఇక మిగిలి ఉన్నది ప్రభాస్‌ సోలో పార్ట్‌. అందుకు సంబంధించిన షూటింగ్ నేటి నుండి జరుగుతోంది. వారం నుండి పది రోజుల్లోనే ఈ షెడ్యూల్‌ ను కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ తో సినిమా చిత్రీకరణ నూరు శాతం ముగిసినట్లు అవుతుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సైఫ్‌ అలీ ఖాన్‌ మరియు ప్రభాస్ ల మద్య జరిగే పోరాట సన్నివేశాలు సినిమాకు హైలైట్‌ గా నిలుస్తాయని అంటున్నారు. ఇప్పటికే వాటిని చిత్రీకరించారు. సినిమా 60 శాతంకు పైగా వీఎఫ్ఎక్స్ తోనే క్రియేట్ చేస్తున్నారట. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ గ్రాఫిక్స్ మూవీగా ఆదిపురుష్ నిలుస్తుందని అంటున్నారు.

సినిమా షూటింగ్‌ పూర్తిగా గ్రీన్‌ మ్యాట్‌ పై చేశారు. కనుక షూటింగ్‌ ఇంత త్వరగా పూర్తి అవ్వబోతుంది. కాని ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ వర్క్ కు ఎక్కువ సమయం పడుతోంది. ఏడాది క్రితమే ఈ సినిమా మోషన్ గ్రాఫిక్స్ వర్క్‌ ప్రారంభం అయ్యింది. షూటింగ్ తో పాటు వీఎఫ్ఎక్స్‌ వర్క్‌ కూడా సమాంతరంగా జరుగుతూ వచ్చింది. జూన్ జులై వరకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది ఆగస్టులో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ పాన్‌ ఇండియా ను దాటి గ్లోబల్‌ స్టార్‌ అవ్వడం ఖాయం అంటూ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఇంకా ఆయన సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు. ఆదిపురుష్‌ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో నిలిచి పోయే సినిమా గా ఉంటుందని అంటున్నారు