Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చిందా..?

By:  Tupaki Desk   |   14 May 2021 4:30 AM GMT
ఆదిపురుష్ పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చిందా..?
X
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''ఆదిపురుష్''. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా 3డీ టెక్నాలజీలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంబైలో 55 - 60 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. కోవిడ్ నేపథ్యంలో షూటింగ్ కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో షూట్ ప్లాన్ హైదరాబాద్ కు షిఫ్ట్ చేసుకున్నారు. మే 15 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించడంతో మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చినట్లైంది.

'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి మిగిలిన షూటింగ్ అంతా గ్రీన్ మ్యాట్‌ పై షూట్ చేయాల్సినదే అని తెలుస్తోంది. హైదరాబాద్ లో సుమారు 90 రోజుల పాటు షూటింగ్ జరపాలని ప్లాన్ చేసుకోగా.. ఇప్పుడు 10 రోజుల లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిందని సమాచారం. నిజానికి లాక్ డౌన్ అనౌన్స్ చేయడంతో చాలా సినిమాలు అర్థాంతరంగా చిత్రీకరణ ఆపేసుకోవాల్సి వచ్చింది. కాగా, 'ఆదిపురుష్' లో శ్రీరాముడిగా ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. టీ-సిరీస్ బ్యానర్‌ పై భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్‌ లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.