Begin typing your search above and press return to search.

అడివి శేష్‌.. ఇంకో థ్రిల్ల‌ర్

By:  Tupaki Desk   |   7 Nov 2016 10:30 PM GMT
అడివి శేష్‌.. ఇంకో థ్రిల్ల‌ర్
X
‘క్ష‌ణం’ సినిమాతో మొత్తం ప‌రిశ్ర‌మ దృష్టిని త‌న వైపు తిప్పుకున్నాడు అడివి శేష్‌. అంత‌కుముందు అత‌డికి ఉన్న ఇమేజ్ మొత్తం ఈ సినిమాతో మారిపోయింది. న‌టుడిగా.. ర‌చ‌యిత‌గా ‘క్ష‌ణం’ సినిమాతో గౌర‌వం సంపాదించుకున్నాడు శేష్‌. ఈ విజ‌యం త‌ర్వాత ఆత్ర‌ప‌డిపోకుండా బాగా టైం తీసుకుని.. ఇటీవ‌లే ‘గూడ‌ఛారి అనే థ్రిల్ల‌ర్ సినిమా మొద‌లుపెట్టాడు. రాహుల్ పాకాల-శశికిరణ్ తిక్కా అనే కొత్త ద‌ర్శ‌క ద్వ‌యం ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే ఇంకో కొత్త సినిమాకు రంగం సిద్ధం చేశాడు శేష్‌. అది కూడా థ్రిల్ల‌ర్ మూవీయేన‌ట‌.

శేష్ చేయ‌బోయే కొత్త సినిమా అత‌డి అన్న‌య్య అడివి సాయికిర‌ణ్ తీయ‌బోతుండ‌టం విశేషం. ‘వినాయ‌కుడు’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత ‘విలేజ్ లో వినాయ‌కుడు’.. ‘కేరింత’ లాంటి యావ‌రేజ్ సినిమాలు అందించిన సాయికిర‌ణ్‌.. ఈసారి త‌న త‌మ్ముడితో క‌లిసి హిట్టు కొట్టి తీరాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. కేరింత త‌ర్వాత బాగా టైం తీసుకుని శేష్ కోసం ఓ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్టు రెడీ చేస్తాడు. ఈ సినిమాను త‌మ హోం బేన‌ర్లోనే తీస్తార‌ట‌. శేష్ ద‌ర్శ‌క‌త్వంలో ‘క‌ర్మ‌’.. ‘కిస్’ లాంటి సినిమాలు నిర్మించి దెబ్బ తిన్నాడు సాయికిర‌ణ్‌. ఈసారి ద‌ర్శ‌కుడిగా.. నిర్మాత‌గా స‌క్సెస్ సాధించి తీరాల‌ని చూస్తున్నాడు. ఈ చిత్రంలో మ‌ల‌యాళ భామ పార్వ‌తీ నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/