Begin typing your search above and press return to search.

ప్రేమ ఉంటే తప్పకుండా చెప్తా

By:  Tupaki Desk   |   8 April 2019 7:17 AM GMT
ప్రేమ ఉంటే తప్పకుండా చెప్తా
X
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌ ఆరంభంలోనే హీరోయిన్‌ రెజీనాతో ప్రేమాయనం సాగిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆమెతో అయితేనే నటిస్తానంటూ నిర్మాతల వద్ద చెప్పేవాడని, దాంతో ఆయన నటించిన పలు సినిమాల్లో రెజీనాను హీరోయిన్‌ గా బుక్‌ చేశారంటే పుకార్లు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఇద్దరి ప్రేమ పెళ్లి పీఠలకు కూడా దారి తీసే అవకాశం ఉందని, మెగా ఫ్యామిలీ కూడా తేజూతో రెజీనా పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ వచ్చిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరు కూడా పదే పదే చెబుతూ వచ్చారు.

గత కొంత కాలంగా వీరిద్దరి కాంబోలో సినిమా కాని, కనీసం వీరిద్దరు కలిసి ఉన్నట్లుగా కూడా బయట కనిపించని కారణంగా ఇద్దరు బ్రేకప్‌ అయ్యారు అంటూ వార్తలు రావడం మొదలు పెట్టింది. తన కెరీర్‌ గురించి, తన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో వస్తున్న వార్తలు చిరాకు కలిగిస్తున్నాయని, పుకార్లు పుట్టించడం వల్ల తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని రెజీనా చెప్పుకొచ్చింది. ఒక వేళ తాను ప్రేమలో ఉంటే తప్పకుండా ఆ విషయాన్ని మీ అందరికి చెప్తాను, నాకు ఇంతటి జీవితాన్ని, స్టార్‌ డంను ఇచ్చిన మీకు ఏ విషయాన్ని అయినా వెంటనే చెప్తాను, నేను ఎప్పుడు ప్రేమలో పడ్డా తప్పకుండా మీకు చెప్తాను అంది.

ప్రస్తుతం, గతంలో మీడియాలో వస్తున్న, వచ్చిన వార్తల్లో ఒక్కటి కూడా నిజం లేదని, తాను ప్రస్తుతం తన కెరీర్‌ ను, సినిమాలను మాత్రమే ప్రేమిస్తున్నాను, వాటిని తప్ప మరెవ్వరిని కూడా ప్రేమించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. తన జీవితంలో ప్రేమ అనేదానికి ప్రస్తుతానికి టైం లేదని, భవిష్యత్తులో ప్రేమలో పడితే మాత్రం చెప్తానంది.

రెజీనాతో ప్రేమ విషయాన్ని హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గతంలోనే పలు సార్లు ఖండించాడు. ఏవేవో పుకార్లు పుట్టుకు వస్తున్నాయని స్నేహితులు అయినా వీరిద్దరు కాస్త డిస్టన్స్‌ మెయింటెన్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.