Begin typing your search above and press return to search.
పాపం రకుల్ కి RRR ఆటంకం?
By: Tupaki Desk | 27 March 2022 9:35 AM ISTదక్షిణాదిన రాణించాక హిందీ సినీపరిశ్రమలో అవకాశం చేజిక్కించుకోవడం చాలా సులువు. అదే కోవలో ఇంతకుముందు పలువురు దక్షిణాది అగ్ర కథానాయికలు ఉత్తరాదినా ఓ వెలుగు వెలిగారు. వీళ్లలో అశిన్ - త్రిష సహా చాలా మంది కథానాయికలు ఉన్నారు. కానీ సుదీర్ఘ కాలం కెరీర్ ని సాగించింది మాత్రం చాలా తక్కువ మంది. ఇటీవలి కాలంలో నవతరం భామలు కూడా బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు. కొన్ని వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ కెరీర్ బండిని సాగిస్తున్నారు.
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు. గత కొన్నేళ్లుగా రకుల్ పూర్తిగా ముంబై పరిశ్రమపైనే దృష్టి సారించింది. తెలుగులో నటిస్తున్నా కానీ తన మనసు మాత్రం బాలీవుడ్ వైపే ఉందన్నది సుస్పష్ఠం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలానో ఈ ఉత్తరాది బ్యూటీకి స్పష్ఠంగా తెలుసు.
అయితే తనకి ఇప్పటివరకూ అదృష్టం కలిసి రాలేదు. నటించిన సినిమాల్లో దేదే ప్యార్ దే మినహా ఇతర సినిమాలేవీ హిట్ కాలేదు. దేదే వల్ల కూడా తనకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఇప్పుడు ఎటాక్ చిత్రంతో థియేటర్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. జాన్ అబ్రహాం లాంటి కండరగండడు ఇందులో హీరో. సైన్స్ ఫిక్షన్ కలగలిసిన మిలటరీ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది.
ఎటాక్ ఏప్రిల్ 1న వెండితెరపైకి రానుంది. ఆ తర్వాత అజయ్ దేవగన్ తో రన్ వే 34 కూడా వస్తుంది. మిషన్ సిండ్రెల్లా-డాక్టర్ జి -థ్యాంక్యూ గాడ్ సహా తమిళ చిత్రం అయలాన్ -ఛత్రివాలి.. ఇంత పెద్ద క్యూ రకుల్ కి ఉంది. అన్నీ 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రకుల్ ప్రీత్ తన వ్యక్తిగత.. వృత్తిపరమైన జీవితాలను గురించి తాజాగా జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఎటాక్ రిలీజవుతున్నా ఆర్.ఆర్.ఆర్ తో చిక్కులు తప్పవన్న భావన అందరిలో ఉంది. రకుల్ ఎటాక్ విజయం సాధిస్తుందా లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటికీ రకుల్ సమాధానం ఇక్కడ ఉంది.
2022 భారీ లైనప్ తో తనకు కలిసి రానుందని రకుల్ వాస్తవికంగా ఆశాభావం వ్యక్తం చేసింది. కోవిడ్ కేసుల సంఖ్య నియంత్రణలో ఉండటంతో థియేటర్ లు పూర్తి స్థాయికి తెరిచారు. అనేక సినిమాలు వాటి థియేట్రికల్ విడుదల తేదీలను లాక్ చేశాయి. ఇదే విషయమై రకుల్ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది.
నా చివరి చిత్రం కొంత కాలం క్రితం విడుదలైనందున నా సినిమాలు రిలీజ్ కి రావాలని నేను చాలా ఎదురు చూస్తున్నాను. థియేటర్లలో `దే దే ప్యార్ దే` విజయం దక్కించుకుంది. సర్దార్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. థియేటర్ లోని ఆ శక్తిని చూసేందుకు ప్రజలు మనం చేసిన పనిని చూసేందుకు ఇకపై వస్తారు. నిజానికి మొదటి లాక్ డౌన్ లో నేను అంతా ప్రశాంతంగా ఉన్నాను.
ప్రజలు కృతజ్ఞతతో ఉండాలని కోరాను. రెండవ లాక్ డౌన్ నేను కూడా భయపడ్డాను. ``ఇది పర్వాలేదు.. కానీ చాలా చెడ్డది. మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు`` అని తెలిపాను. మూడవది ఇప్పుడు కాలం గడిచినా మళ్లీ విడుదలలు ముందుకు వచ్చినప్పుడు.. నేను ఇలా చేశాను. ``నాకు ధ్యానం అక్కర్లేదు .. నా సినిమాల్ని ప్రజలు చూడాలి.
ఈ సంవత్సరం 6 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి! నేను మొత్తం 6 షూటింగ్ లు పూర్తి చేసాను. కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలి. అంతా కలిసి రావడం మొదలవుతుందనే ఆశిస్తున్నా. మీరు ఈ సినిమాల కోసం వేచి ఉన్నారు. కెరీర్ నిజంగా మీ చిత్రాల విడుదల సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇకపై అది నాకు రావడం ప్రారంభమైంది. కనీసం సినిమాలు విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది`` అని అన్నారు.
మహమ్మారి సమయంలో అనేక చిత్రాలు OTT మార్గంలో విడుదలయ్యాయి. OTT - థియేటర్ ల మధ్య ఆమె ఏమి ఎంచుకుంటుందో అడిగితే.. మేము పెద్ద స్క్రీన్ పై ప్రేమ కోసం నటులమవుతాము కాబట్టి ఇది ఎల్లప్పుడూ మొదటి ప్రేమగా ఉంటుంది. వాస్తవానికి OTTకి ప్రత్యేకించి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేదికపై కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా మీకు చేరువవుతుంది.
ప్రజలు ఓటీటీల్లో తమకు అనుకూలమైన సమయంలో మరిన్ని అంశాలను సులభంగా చూడగలరు. కొన్ని అద్భుతమైన కంటెంట్ లు బయటకు వస్తున్నాయి. కాబట్టి నేను రెండిటి కోసం ఉన్నాను. పని చేస్తాను. కానీ దేనికదే స్వంత ఆకర్షణ ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆన్ లైన్ లో మీరు ఆర్డర్ చేయవచ్చు.. కానీ మీరు ఇప్పటికీ రెస్టారెంట్ కు వెళ్లాలని కూడా అనుకుంటారు`` అని రకుల్ జవాబిచ్చారు.
జాకీ భగ్నానీతో తన ప్రేమ జీవితంపై కొన్ని పుకార్ల గురించిన చెబుతూ.. వ్యక్తిగత జీవితం గురించి స్పందించకుండా ఉండటం నా పని. నా వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు. ప్రజలు మేం ధరించే దుస్తుల గురించి.. చేసే వాటి గురించి వారికి నచ్చిన విధంగా మాట్లాడతారు. కానీ అది మేం పట్టించుకోలేం. నేను మంచిని తీసుకుంటాను.. మిగిలిన వాటిని వదిలివేస్తాను`` అని తెలిపారు. రకుల్ త్వరలోనే నిర్మాత జాకీని పెళ్లాడనుంది.
ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు. గత కొన్నేళ్లుగా రకుల్ పూర్తిగా ముంబై పరిశ్రమపైనే దృష్టి సారించింది. తెలుగులో నటిస్తున్నా కానీ తన మనసు మాత్రం బాలీవుడ్ వైపే ఉందన్నది సుస్పష్ఠం. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం ఎలానో ఈ ఉత్తరాది బ్యూటీకి స్పష్ఠంగా తెలుసు.
అయితే తనకి ఇప్పటివరకూ అదృష్టం కలిసి రాలేదు. నటించిన సినిమాల్లో దేదే ప్యార్ దే మినహా ఇతర సినిమాలేవీ హిట్ కాలేదు. దేదే వల్ల కూడా తనకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఇప్పుడు ఎటాక్ చిత్రంతో థియేటర్లలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. జాన్ అబ్రహాం లాంటి కండరగండడు ఇందులో హీరో. సైన్స్ ఫిక్షన్ కలగలిసిన మిలటరీ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది.
ఎటాక్ ఏప్రిల్ 1న వెండితెరపైకి రానుంది. ఆ తర్వాత అజయ్ దేవగన్ తో రన్ వే 34 కూడా వస్తుంది. మిషన్ సిండ్రెల్లా-డాక్టర్ జి -థ్యాంక్యూ గాడ్ సహా తమిళ చిత్రం అయలాన్ -ఛత్రివాలి.. ఇంత పెద్ద క్యూ రకుల్ కి ఉంది. అన్నీ 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రకుల్ ప్రీత్ తన వ్యక్తిగత.. వృత్తిపరమైన జీవితాలను గురించి తాజాగా జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఎటాక్ రిలీజవుతున్నా ఆర్.ఆర్.ఆర్ తో చిక్కులు తప్పవన్న భావన అందరిలో ఉంది. రకుల్ ఎటాక్ విజయం సాధిస్తుందా లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నిటికీ రకుల్ సమాధానం ఇక్కడ ఉంది.
2022 భారీ లైనప్ తో తనకు కలిసి రానుందని రకుల్ వాస్తవికంగా ఆశాభావం వ్యక్తం చేసింది. కోవిడ్ కేసుల సంఖ్య నియంత్రణలో ఉండటంతో థియేటర్ లు పూర్తి స్థాయికి తెరిచారు. అనేక సినిమాలు వాటి థియేట్రికల్ విడుదల తేదీలను లాక్ చేశాయి. ఇదే విషయమై రకుల్ మాట్లాడుతూ.. ‘‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది.
నా చివరి చిత్రం కొంత కాలం క్రితం విడుదలైనందున నా సినిమాలు రిలీజ్ కి రావాలని నేను చాలా ఎదురు చూస్తున్నాను. థియేటర్లలో `దే దే ప్యార్ దే` విజయం దక్కించుకుంది. సర్దార్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చింది. థియేటర్ లోని ఆ శక్తిని చూసేందుకు ప్రజలు మనం చేసిన పనిని చూసేందుకు ఇకపై వస్తారు. నిజానికి మొదటి లాక్ డౌన్ లో నేను అంతా ప్రశాంతంగా ఉన్నాను.
ప్రజలు కృతజ్ఞతతో ఉండాలని కోరాను. రెండవ లాక్ డౌన్ నేను కూడా భయపడ్డాను. ``ఇది పర్వాలేదు.. కానీ చాలా చెడ్డది. మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు`` అని తెలిపాను. మూడవది ఇప్పుడు కాలం గడిచినా మళ్లీ విడుదలలు ముందుకు వచ్చినప్పుడు.. నేను ఇలా చేశాను. ``నాకు ధ్యానం అక్కర్లేదు .. నా సినిమాల్ని ప్రజలు చూడాలి.
ఈ సంవత్సరం 6 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి! నేను మొత్తం 6 షూటింగ్ లు పూర్తి చేసాను. కాబట్టి ఏమి జరుగుతుందో చూడాలి. అంతా కలిసి రావడం మొదలవుతుందనే ఆశిస్తున్నా. మీరు ఈ సినిమాల కోసం వేచి ఉన్నారు. కెరీర్ నిజంగా మీ చిత్రాల విడుదల సక్సెస్ పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇకపై అది నాకు రావడం ప్రారంభమైంది. కనీసం సినిమాలు విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది`` అని అన్నారు.
మహమ్మారి సమయంలో అనేక చిత్రాలు OTT మార్గంలో విడుదలయ్యాయి. OTT - థియేటర్ ల మధ్య ఆమె ఏమి ఎంచుకుంటుందో అడిగితే.. మేము పెద్ద స్క్రీన్ పై ప్రేమ కోసం నటులమవుతాము కాబట్టి ఇది ఎల్లప్పుడూ మొదటి ప్రేమగా ఉంటుంది. వాస్తవానికి OTTకి ప్రత్యేకించి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వేదికపై కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా మీకు చేరువవుతుంది.
ప్రజలు ఓటీటీల్లో తమకు అనుకూలమైన సమయంలో మరిన్ని అంశాలను సులభంగా చూడగలరు. కొన్ని అద్భుతమైన కంటెంట్ లు బయటకు వస్తున్నాయి. కాబట్టి నేను రెండిటి కోసం ఉన్నాను. పని చేస్తాను. కానీ దేనికదే స్వంత ఆకర్షణ ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆన్ లైన్ లో మీరు ఆర్డర్ చేయవచ్చు.. కానీ మీరు ఇప్పటికీ రెస్టారెంట్ కు వెళ్లాలని కూడా అనుకుంటారు`` అని రకుల్ జవాబిచ్చారు.
జాకీ భగ్నానీతో తన ప్రేమ జీవితంపై కొన్ని పుకార్ల గురించిన చెబుతూ.. వ్యక్తిగత జీవితం గురించి స్పందించకుండా ఉండటం నా పని. నా వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు. ప్రజలు మేం ధరించే దుస్తుల గురించి.. చేసే వాటి గురించి వారికి నచ్చిన విధంగా మాట్లాడతారు. కానీ అది మేం పట్టించుకోలేం. నేను మంచిని తీసుకుంటాను.. మిగిలిన వాటిని వదిలివేస్తాను`` అని తెలిపారు. రకుల్ త్వరలోనే నిర్మాత జాకీని పెళ్లాడనుంది.
