Begin typing your search above and press return to search.
సుశాంత్ చనిపోయేముందు ఆ డైరక్టర్ కు మెసేజ్..
By: Tupaki Desk | 30 Jan 2023 8:00 AM GMTబాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి మూడేళ్లు అవుతున్నా అతడి సూసైడ్ కేసు మిస్టరీ వీడలేదు. అతడి అభిమానులు ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. సోషల్మీడియాలో అతడిపేరుతో ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. అయితే అతడి గురించి ఓ విషయాన్ని చెప్పారు దర్శకుడు అనురాగ్ కశ్యప్. సుశాంత్ చనిపోవడానికి మూడు వారాల ముందు అతని టీమ్ నుంచి తనకు సందేశం వచ్చిందని తెలిపారు. సుశాంత్ని తాను కలవలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పాడు.
"సుశాంత్ సింగ్ మృతి నిజంగా దురదృష్టకరం. నేను ఎంతో బాధపడ్డా. సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా మూడు వారాల ముందు అతడి టీమ్ నుంచి ఓ వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. సుశాంత్ నన్ను కలవాలనుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. 'అతడితో నేను మాట్లాడాలనుకోవడం లేదు' అని బదులిచ్చాను. ఆ తర్వాత నేను ఎంతో బాధపడ్డా. ఇలా ఎప్పుడూ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇటీవల అభయ్ డియోల్తో గొడవలు వచ్చినప్పుడు కూడా.. నా మాటల వల్ల ఆయన బాధపడుతున్నాడని తెలిసి వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాను" అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
కాగా, సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బుల్లితెరపై ఫుల్ క్రేజ్ తెచుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ధోనీ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అనుకోని కారణాల వల్ల 2020లో సుశాంత్ ఆత్మహత్యకు చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత అనురాగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. సుశాంత్తో తాను ఓ సినిమా చేయాలనుకున్నానని, కాకపోతే అతడి ప్రవర్తన నచ్చక ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశానని చెప్పారు.
ఇకపోతే ఇటీవలే సుశాంత్ అభిమానులకు మరో బాధకరమైన విషయం తెలిసింది. సుశాంత్ పెంపుడు కుక్క ఫడ్జ్ కన్నుమూసింది. సుశాంత్ ఫడ్జ్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు. రూమ్లో ఉన్నపుడు అదే అతడి ప్రపంచం కూడా. దాన్ని ఆడిస్తూ.. ఆడుకుంటూ ఉండేవారు. అయితే సుశాంత్ మరణించాకు ఫడ్జ్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. తలుపు చప్పుడు అయితే చాలు సుశాంత్ వచ్చాడేమో అనుకుని వెళ్లిపోయేదాని, అతడి ఫొటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది అప్పట్లో వార్తలు, ఫొటోలు కూడా విపరీతంగా వచ్చాయి.
"సుశాంత్ సింగ్ మృతి నిజంగా దురదృష్టకరం. నేను ఎంతో బాధపడ్డా. సుశాంత్ చనిపోవడానికి సరిగ్గా మూడు వారాల ముందు అతడి టీమ్ నుంచి ఓ వ్యక్తి నాకు మెసేజ్ చేశాడు. సుశాంత్ నన్ను కలవాలనుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. 'అతడితో నేను మాట్లాడాలనుకోవడం లేదు' అని బదులిచ్చాను. ఆ తర్వాత నేను ఎంతో బాధపడ్డా. ఇలా ఎప్పుడూ చేయకూడదని నిర్ణయించుకున్నా. ఇటీవల అభయ్ డియోల్తో గొడవలు వచ్చినప్పుడు కూడా.. నా మాటల వల్ల ఆయన బాధపడుతున్నాడని తెలిసి వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పాను" అని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.
కాగా, సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బుల్లితెరపై ఫుల్ క్రేజ్ తెచుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ధోనీ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అనుకోని కారణాల వల్ల 2020లో సుశాంత్ ఆత్మహత్యకు చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత అనురాగ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. సుశాంత్తో తాను ఓ సినిమా చేయాలనుకున్నానని, కాకపోతే అతడి ప్రవర్తన నచ్చక ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశానని చెప్పారు.
ఇకపోతే ఇటీవలే సుశాంత్ అభిమానులకు మరో బాధకరమైన విషయం తెలిసింది. సుశాంత్ పెంపుడు కుక్క ఫడ్జ్ కన్నుమూసింది. సుశాంత్ ఫడ్జ్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవారు. రూమ్లో ఉన్నపుడు అదే అతడి ప్రపంచం కూడా. దాన్ని ఆడిస్తూ.. ఆడుకుంటూ ఉండేవారు. అయితే సుశాంత్ మరణించాకు ఫడ్జ్ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. తలుపు చప్పుడు అయితే చాలు సుశాంత్ వచ్చాడేమో అనుకుని వెళ్లిపోయేదాని, అతడి ఫొటోను చూస్తూ కన్నీళ్లు పెట్టుకునేది అప్పట్లో వార్తలు, ఫొటోలు కూడా విపరీతంగా వచ్చాయి.