Begin typing your search above and press return to search.
కనకాల ఇంట్లో మరో విషాదం
By: Tupaki Desk | 6 April 2020 1:14 PM GMTకొన్ని రోజుల క్రితమే రాజీవ్ కనకాల తల్లి లక్ష్మి ఆ వెంటనే తండ్రి దేవదాస్ కనకాల మృతి చెందిన విషయం తెల్సిందే. తల్లిదండ్రులు మృతి చెందడటంతో రాజీవ్ కనకాల ఫ్యామిలీ పెద్ద లోటును ఎదుర్కొంటుంది. ఇప్పుడిప్పుడే వారిద్దరి మృతి నుండి బయటకు వస్తున్న రాజీవ్ కనకాల ఇంకా సుమ కనకాల ఫ్యామిలీకి మరో పెద్ద షాకింగ్ సంఘటన ఎదురైంది. అదే రాజీవ్ కనకాల సోదరి శ్రీలక్ష్మి మృతి. నేడు అనారోగ్య కారణాలతో శ్రీలక్ష్మి కనకాల మృతి చెందారు.
తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటన రంగంలో ఉండటంతో శ్రీలక్ష్మి కూడా నటన రంగంలో రాణించారు. దూరదర్శిన్ కాలం నుండే శ్రీలక్ష్మి నటన రంగంలో ఉన్నారు. దూరదర్శిణిలో వచ్చిన పలు కార్యక్రమాలు ఇంకా సీరియల్స్ లో శ్రీలక్ష్మి నటించారు. సోదరుడు రాజీవ్ కనకాలతో పాటు శ్రీలక్ష్మి కూడా బుల్లి తెరపై మంచి గుర్తింపును దక్కించుకున్నారు. మొన్నటి వరకు కూడా పలు సీరియల్స్ లో నటిస్తూనే వచ్చారు.
శ్రీలక్ష్మి మరణ వార్తను కనకాల ఫ్యామిలీకి చెందిన వారు ఒకరు వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరంగా పేర్కొంటూ ఆమె మరణ వార్తను మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలక్ష్మికి శ్రద్దాంజలి ఘటించేందుకు ఎవరు రావద్దంటూ ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో శ్రీలక్ష్మి అంత్యక్రియు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మి జర్నలిస్ట్ రామారావును వివాహం చేసుకుంది.. ఆమెకు ఇద్దరు కూతుర్లు.
శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన బుల్లి తెర ప్రముఖులు ఇంకా నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ టైంలో మృతి చెందడంతో ఆమెను కడసారి కూడా చూడలేక పోతున్నామనే బాధ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటన రంగంలో ఉండటంతో శ్రీలక్ష్మి కూడా నటన రంగంలో రాణించారు. దూరదర్శిన్ కాలం నుండే శ్రీలక్ష్మి నటన రంగంలో ఉన్నారు. దూరదర్శిణిలో వచ్చిన పలు కార్యక్రమాలు ఇంకా సీరియల్స్ లో శ్రీలక్ష్మి నటించారు. సోదరుడు రాజీవ్ కనకాలతో పాటు శ్రీలక్ష్మి కూడా బుల్లి తెరపై మంచి గుర్తింపును దక్కించుకున్నారు. మొన్నటి వరకు కూడా పలు సీరియల్స్ లో నటిస్తూనే వచ్చారు.
శ్రీలక్ష్మి మరణ వార్తను కనకాల ఫ్యామిలీకి చెందిన వారు ఒకరు వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరంగా పేర్కొంటూ ఆమె మరణ వార్తను మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలక్ష్మికి శ్రద్దాంజలి ఘటించేందుకు ఎవరు రావద్దంటూ ఆ వీడియోలో పేర్కొనడం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలో శ్రీలక్ష్మి అంత్యక్రియు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలక్ష్మి జర్నలిస్ట్ రామారావును వివాహం చేసుకుంది.. ఆమెకు ఇద్దరు కూతుర్లు.
శ్రీలక్ష్మి మరణ వార్త తెలిసిన బుల్లి తెర ప్రముఖులు ఇంకా నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఈ టైంలో మృతి చెందడంతో ఆమెను కడసారి కూడా చూడలేక పోతున్నామనే బాధ చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.