Begin typing your search above and press return to search.

మంచు విష్ణు లవ్‌ స్టోరీ : పారిపోవడం.. దాసరి పద్మ మద్యవర్తిత్వం

By:  Tupaki Desk   |   26 Aug 2021 5:30 AM GMT
మంచు విష్ణు లవ్‌ స్టోరీ : పారిపోవడం.. దాసరి పద్మ మద్యవర్తిత్వం
X
మంచు విష్ణు.. వెరోనికా లది ప్రేమ వివాహం అనే విషయం తెల్సిందే. ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి మొదట ఇబ్బందులు తప్పలేదు. మోహన్‌ బాబుకు తమ ప్రేమ విషయం చెప్పేందుకు మంచు విష్ణు సాహసించలేదట. ఇంట్లో అమ్మకు తెలిసినా కూడా నాన్నకు మాత్రం తెలియలేదు అని.. ఆయనకు చెప్పేంత సాహసం చేయక ఏడాది పాటు తమ ప్రేమ వ్యవహారంను రహస్యంగా సాగించినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి తాజాగా మంచు విష్ణు షేర్‌ చేసుకున్నాడు.

ప్రేమలో ఉన్న సమయంలో తాజ్ కృష్ణ కు రెగ్యులర్ గా లంచ్ కు వెళ్లే వాళ్లం. ఒక రోజు తాజ్ కృష్ణలో ఉన్న సమయంలో నాన్న గారు వచ్చిన విషయం తెల్సిందే. దాంతో నేను మేనేజర్ సాయంతో కిచెన్‌ నుండి బయటకు వెళ్లి పోయాను. ఆ సమయంలో నాన్నగారికి దొరికి పోయానేమో అనిపించింది అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో రావడం వల్లే ఇంట్లో తెలిసింది అంటూ మంచు విష్ణు వ్యాఖ్యలు చేశాడు.

మొదట నాన్నగారు పెళ్లి విషయంలో ఆసక్తి చూపించలేదు. అయినా కూడా దాసరి పద్మ గారి మద్యవర్తిత్వం వల్ల తమ పెళ్లి అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆమె రంగంలోకి దిగి నాన్నకు నచ్చజెప్పడం వల్ల తమ పెళ్లి అయ్యిందని మంచు విష్ణు అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరు చాలా హ్యాపీ లైఫ్ ను లీడ్‌ చేస్తున్నారు. చాలా ప్రత్యేకంగా నలుగురు పిల్లలతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు మరియు వెరోనికల ప్రేమ వివాహం పై అప్పట్లో పలు రకాల చర్చలు జరిగాయి. ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా కుటుంబం మొత్తం ఉన్నారు.