Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్, నాగచైతన్యంతో మొక్కలు నాటించిన ఎంపీ సంతోష్

By:  Tupaki Desk   |   19 Sep 2021 10:31 AM GMT
అమీర్ ఖాన్, నాగచైతన్యంతో మొక్కలు నాటించిన ఎంపీ సంతోష్
X
సీఎం కేసీఆర్ తోడల్లుడి కుమారుడు, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ నలుదిశలా వ్యాపిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఈ చాలెంజ్ లో మొక్కలు నాటారు. తెలంగాణ హరితహారం స్ఫూర్తిగా ఈ చాలెంజ్ ను చేపట్టిన సంతోష్ కుమార్ సినీ, రాజకీయ ప్రముఖులను ఇందులో ఇన్ వాల్వ్ చేసి మొక్కలు నాటించే ప్రక్రియను ముందుకు తీసుకెళుతున్నారు.

కోట్ల హృదయాలను కదిలించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" నిర్విఘ్నంగా ముందుకు సాగుతోంది. ప్రతీ రోజు పుడమిపై వేల చేతులు మూడు మొక్కలు నాటుతూ మురిసిపోతున్నాయి. సామాన్యుల నుంచి మహామహులను కదిలించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" ఇవ్వాల బాలీవుడ్ సూపర్ స్టార్, విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ ను చేరింది. తాజాగా బేగంపేట ఎయిర్ పోర్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో "అమీర్ ఖాన్" మొక్కలు నాటాడు.

ఇవ్వాల హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం అప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.