Begin typing your search above and press return to search.

ఈత‌కొల‌ను మ‌త్స్యంలా జ‌ల‌కాల‌డుతున్న న‌టి

By:  Tupaki Desk   |   28 April 2021 11:53 AM GMT
ఈత‌కొల‌ను మ‌త్స్యంలా జ‌ల‌కాల‌డుతున్న న‌టి
X
మాజీ మిస్ క‌ర్నాట‌క .. క‌న్న‌డ మ‌ల‌యాళ న‌టి పార్వ‌తి నాయిర్ సోష‌ల్ మీడియాల్లో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఇటీవ‌లే త‌న జిమ్ కోచ్ స‌డెన్ గా త‌న‌ని హ‌గ్ చేసుకోవ‌డంతో షాక్ కి గుర‌య్యాన‌ని తెలిపిన ఈ బ్యూటీ మాల్దీవుల విహారంలో ఆస్వాధ‌న‌ల‌కు సంబంధించిన ఫోటోల‌ను వ‌రుస‌గా షేర్ చేస్తున్నారు.

తాజాగా పార్వతి ఈత‌కొల‌నులో చేప‌లా ఈదుతున్న ఓ ఫోటోని షేర్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఇంత‌కుముందు దిశా ప‌టానీ.. కాజ‌ల్ .. ప‌రిణీతి.. జాన్వీ.. సారా.. లాంటి న‌టీమ‌ణులు మాల్దీవుల్లో ఈత‌కొల‌నులో ఈదుతున్న దృశ్యాల్ని షేర్ చేశారు. ఇప్పుడు పార్వ‌తి నుంచి అలాంటి స్పెష‌ల్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది.

ఓవైపు క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతుంటే బాధ్య‌త లేకుండా ఇలా ఒంట‌రి దీవుల విహార‌మా? అంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స్టార్లు కొంత వెన‌క్కి త‌గ్గాల్సిన ప‌రిస్థితి. పైగా మాల్దీవుల‌కు ఇండియా యాత్రికుల‌ను ప్ర‌స్తుతానికి అనుమ‌తించ‌ని సంగ‌తి తెలిసిందే. దీంతో పార్వతి త్రోబ్యాక్ ఫోటోల‌ను షేర్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.