Begin typing your search above and press return to search.
SSMB 28కు అప్పుడే రూ.300కోట్లా?
By: Tupaki Desk | 2 Feb 2023 6:08 PM GMTసూపర్ స్టార్ మహేశ్బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమా (#SSMB28) కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా పూర్తి చేసుకోకుండానే అదిరిపోయే ప్రీ బిజినెస్ చేస్తోంది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంక్రాంతి రోజే ప్రకటించింది. రూ.80 కోట్లకు నెట్ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుందని అంటున్నారు. అయితే ఇప్పుడు మరో తాజా వార్తా ఏంటంటే.. ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ రైట్స్ను రూ.100కోట్లకు కొనుగోలు అయ్యాయట. ఇక థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.200కోట్ల వరకు జరిగిందని సమాచారం. మొత్తంగా రూ.300కోట్లకు ఈ చిత్ర హక్కులు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం బ్రెక్ ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లు ఉండొచ్చని అంచనా.
ఇకపోతే ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల మరో కథానాయికగా కనిపించనుంది. మహేశ్తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా అవ్వడంతో ఈ చిత్రానికి ఇంత భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ వార్త మాత్రం ఫిల్మ్ సర్కిల్లో తెగ తిరిగేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని ఈ ఏడాదే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్ చేయనున్నారు. భారీ బడ్జెట్తో దీన్ని రూపొందించనున్నారు. ఈ మూవీ కోసం సీసీఏ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో జక్కన్న ఒప్పందం చేసుకున్నారు. పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. చూడాలి ఇక మహేశ్ వరల్డ్ వైడ్ స్టార్ గా ఎదుగుతాడో లేదో!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
ఇకపోతే ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల మరో కథానాయికగా కనిపించనుంది. మహేశ్తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కు కూడా ఇది తొలి పాన్ ఇండియా సినిమా అవ్వడంతో ఈ చిత్రానికి ఇంత భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ ఈ వార్త మాత్రం ఫిల్మ్ సర్కిల్లో తెగ తిరిగేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని ఈ ఏడాదే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్ నిర్మిస్తోంది.
ఈ చిత్రం తర్వాత మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్ చేయనున్నారు. భారీ బడ్జెట్తో దీన్ని రూపొందించనున్నారు. ఈ మూవీ కోసం సీసీఏ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో జక్కన్న ఒప్పందం చేసుకున్నారు. పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్గా రూపొందనుంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. చూడాలి ఇక మహేశ్ వరల్డ్ వైడ్ స్టార్ గా ఎదుగుతాడో లేదో!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.