Begin typing your search above and press return to search.

'పక్కా కమర్షియల్' కోసం కోటి యాభై లక్షల సెట్..?

By:  Tupaki Desk   |   7 Dec 2021 2:30 AM GMT
పక్కా కమర్షియల్ కోసం కోటి యాభై లక్షల సెట్..?
X
మ్యాచో స్టార్ గోపీచంద్ - రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ హీరో - ఎంటర్టైన్మెంట్ చిత్రాల దర్శకుడు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే 'పక్కా కమర్షియల్' సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో గోపీచంద్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. దీని కోసం కోటి యాభై లక్షలతో స్పెషల్ సెట్ నిర్మించినట్లు సమాచారం. 'పక్కా కమర్షియల్' సినిమా గోపీచంద్ కెరీర్ లోనే కాస్ట్ లీ మూవీగా రెడీ అవుతోందని తెలుస్తోంది.

అయితే కరోనా సమయంలో అంత పెద్ద పెద్ద సెట్స్ వేసి బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే కామెంట్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో టిక్కెట్ ధరలు - బెనిఫిట్ షోలకు అవకాశం లేకపోకడం వంటివి ఇండస్ట్రీకి సమస్యలుగా మారాయి.

అందులోనూ ఇప్పుడు కరోనా కొత్త వేవ్ అనే ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్లకు వస్తున్నారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళకి వైరస్ భయం పట్టుకుంటే కష్టమే. ఇవన్నీ ఆలోచించుకుని ఫిలిం మేకర్స్ బడ్జెట్ కంట్రోల్ లో ఉంచుకుంటే మంచిదనే సలహాలు వస్తున్నాయి.

కానీ 'సీటీమార్' వంటి సూపర్ హిట్ సినిమాతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చిన గోపీచంద్.. ''పక్కా కమర్షియల్'' చిత్రంతో కచ్చితంగా సాలిడ్ హిట్ కొడతారని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. మరోవైపు దర్శకుడు మారుతి కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకొని.. నెక్ట్స్ లెవల్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరి ఈ సినిమా వీరికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

కాగా, 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

'జిల్' తర్వాత గోపీచంద్ - రాశీఖన్నా కలిసి నటిస్తోన్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.