Begin typing your search above and press return to search.

హరీష్ మల్టిస్టారర్ బ్యానర్ మారింది

By:  Tupaki Desk   |   27 Sep 2018 4:28 AM GMT
హరీష్ మల్టిస్టారర్ బ్యానర్  మారింది
X
'దువ్వాడ జగన్నాధం' రిలీజ్ అయిన ఏడాది దాటినా డైరెక్టర్ హరీష్ శంకర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంతవరకూ ప్రకటించలేదు. 'డీజే' నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే హరీష్ తదుపరి చిత్రం ఉంటుందని.. అదొక యువ హీరోల మల్టిస్టారర్ అని.. టైటిల్ 'దాగుడుమూతలు' అని వార్తలు వచ్చినా ఎందుకో అది పట్టాలెక్కలేదు. దీంతో దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ చిత్రం లేదని అందరికీ క్లారిటీ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం అదే స్క్రిప్ట్ తో హరీష్ శంకర్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారిని మెప్పించాడట. దీంతో 'దాగుడుమూతలు' నిర్మించేందుకు వారు ముందుకొచ్చారని అంటున్నారు. అలా అని వారు మాత్రమే ప్రొడ్యూసర్స్ కాదు. ఈ సినిమాకు హరీష్ శంకర్ కూడా నిర్మాతేనట. 14 రీల్స్ వారు నిర్మాణ భాగస్వామిగా ఉంటూ హరీష్ కు సహాయసహకారాలు అందిస్తారట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ మొదలైందట. త్వరలో ఈ ఇతర వివరాలు వెల్లడవుతాయి.

ఇక హరీష్ లాస్ట్ ఫిలిం 'డీజే' కలెక్షన్స్ పరంగా పరవాలేదనిపించినా కంటెంట్ వైజ్ అందరూ పెదవి విరిచారు. పైగా ఆ సినిమాచుట్టూ నెలకొన్న వివాదాలు కూడా హరీష్ ఇమేజ్ కి నష్టం కలిగించాయి. మరి ఈ 'దాగుడుమూతలు' సినిమా మళ్ళీ హరీష్ కి మంచి విజయం అందిస్తుందేమో వేచి చూడాలి.