Begin typing your search above and press return to search.

సందీపుడి ప్ర‌స్థానానికి 12 ఏళ్లు

By:  Tupaki Desk   |   16 April 2022 11:43 AM GMT
సందీపుడి ప్ర‌స్థానానికి 12 ఏళ్లు
X
శ‌ర్వానంద్ హీరోగా, డైలాగ్ కింగ్‌ సాయి కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప్ర‌స్థానం'. 2010, ఏప్రిల్ 16న ఈ చిత్రం విడుద‌లైంది. ఈ చిత్రం విడుద‌లై నేటికి 12 ఏళ్ల‌వుతోంది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం యంగ్ హీరో సందీప్ కిష‌న్ సినీ ప్ర‌స్థానం మొద‌లైంది. ఆయ‌న న‌టించిన తొలి చిత్రమిది. ఇందులో చిన్నాగా న‌టించి యార‌గెంట్ పాత్ర‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు సందీప్ కిష‌న్‌. స‌మ‌కాలీన రాజ‌కీయాంశాల నేప‌థ్యంలో రూపొందిన ఆ చిత్రం న‌టుడిగా సందీప్ కిష‌న్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. హీరో శ‌ర్వాకు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లోకీగా న‌టించిన‌ సాయి కుమార్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

నంది పుర‌స్కారాల్లో ఉత్త‌మ చిత్రంగా కాంస్య నందిని సొంతం చేసుకుంది. అలాగే ఉత్త‌మ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సాయి కుమార్ కు నంది పుర‌స్కారాన్ని అందించింది. పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని దేవా క‌ట్టా తెర‌కెక్కించారు. ఇదే చిత్రాన్ని హిందీలో సంజ‌య్ ద‌త్ తో రీమేక్ చేశారు.

అక్క‌డ కూడా మంచి విజ‌యాన్ని సాధించింది. 12 ఏళ్ల క్రితం హీరోగా త‌న కెరీర్ ని ప్రారంభించిన సందీప్ కిష‌న్ అంచ‌లంచెలుగా ఎదురుతూ టాలీవుడ్ యంగ్ హీరోల్లో త‌నకంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు.

'రొటీన్ ల‌వ్ స్టోరీ' మూవీతో హీరోగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిష‌న్ 2013 లో మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో హీరోగా తొలి క‌మర్షియ‌ల్ స‌క్సెస్ ని సొంతం చేసుకున్నారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో హీరోగా న‌టిస్తూ మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటున్నారు. రీసెంట్ గా `గ‌ల్లీ రౌడీ`తో సాలీడ్ హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్న సందీప్ కిష‌న్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నాడు.

సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ 'మైఖేల్‌'. విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ చిత్రం కోసం హీరో సందీప్ కిష‌న్ సిక్స్ ప్యాక్ తో డిఫ‌రెంట్ మేకోవ‌ర్ లో క‌నిపించ‌బోతున్నాడు.

రిసెంట్ గా సోస‌ల్‌మీడియా వేదిక‌గా హీరో సందీప్ కిష‌న్ షేర్ చేసిన ఫొటోలు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ ఎల్ పీ, క‌ర‌ణ్ సీ ప్రొడ‌క్ష‌న్స్ ఎల్ ఎల్ పీ బ్యాన‌ర్ ల‌పై నార‌య‌ణ్ దాస్ కె నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో రంజిత్ జ‌య‌కోడి తెర‌కెక్కిస్తున్నారు.