Begin typing your search above and press return to search.

ఐదేళ్ల తర్వాత ఆ గొంతు మళ్లీ...!

సంగీత దర్శకుడు, సినీ గాయకుడు అర్జిత్ సింగ్‌ తెలుగు లో 2010 నుంచి 2018 మధ్యలో పలు సూపర్ హిట్ సాంగ్స్ ని పాడి శ్రోతలను అలరించాడు.

By:  Tupaki Desk   |   12 March 2024 10:51 AM GMT
ఐదేళ్ల తర్వాత ఆ గొంతు మళ్లీ...!
X

సంగీత దర్శకుడు, సినీ గాయకుడు అర్జిత్ సింగ్‌ తెలుగు లో 2010 నుంచి 2018 మధ్యలో పలు సూపర్ హిట్ సాంగ్స్ ని పాడి శ్రోతలను అలరించాడు. ఆయన చివరిగా 2018 లో హుశారు సినిమా కోసం ఉండిపోరాదే పాట పాడాడు. ఆ పాట కూడా సూపర్ హిట్ అయ్యి ఇప్పటికి కూడా యూత్‌ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

అర్జిత్ సింగ్‌ బిజీ షెడ్యూల్‌ ఇతర కారణాల వల్ల తెలుగు లో గత ఐదు సంవత్సరాలుగా పాట పాడటం లేదు. ఎట్టకేలకు ఆయన పాటను ఈ ఏడాది వినే అవకాశం శ్రోతలకు దక్కబోతుంది. ఈ ఏడాది ఇప్పటికే ఆయన ఎన్టీఆర్‌ దేవర సినిమా కోసం ఒక పాట పాడాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఓం భీమ్‌ బుష్‌ సినిమా కోసం రెండు పాటలు పాడాడు. అర్జిత్‌ సింగ్ గత పాటల మాదిరిగానే ఈ సినిమా పాటలు కూడా హిట్‌ అవుతాయనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ పాటలు వస్తాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గుప్త నిధుల కోసం ముగ్గురు శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలను వినోదాత్మకంగా చూపించే సినిమా ఓం భీమ్ బష్‌. ఈ సినిమాలో శ్రీ విష్ణు తో పాటు రాహుల్‌ రామకృష్ణ మరియు ప్రిదర్శిలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా కి శ్రీ హర్ష కోనుగంటి దర్శకత్వం వహించారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.