Begin typing your search above and press return to search.

విశ్వంభర.. రంగంలోకి మరో సీనియర్ బ్యూటీ?

బాక్సాఫీస్ వద్ద బింబిసార సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

By:  Tupaki Desk   |   15 May 2024 7:53 AM GMT
విశ్వంభర.. రంగంలోకి మరో సీనియర్ బ్యూటీ?
X

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన తదుపరి సినిమా విశ్వంభర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సైరా సినిమా తర్వాత మళ్లీ హై రేంజ్ లో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద బింబిసార సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.


సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ మోషన్ పోస్టర్ కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల లీక్స్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో స్టాలిన్ లో కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు జోడిగా కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా, ఆశికా రంగనాథ్ లాంటి ప్రముఖ బ్యూటీలు కూడా ఈ సినిమాలో కొన్ని కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే రీసెంట్ గా దర్శకుడు మరొక సీనియర్ హీరోయిన్ ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సన్నివేశాలలో ఆ పాత్ర చాలా స్పెషల్ గా ఉండబోతుందట. అయితే ఆ పాత్ర కోసం మొదట విజయశాంతిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ సాధ్యం కాలేదట. ఇక ఇప్పుడు చిత్ర యూనిట్ సీనియర్ హీరోయిన్ ఖుష్బూను సెలెక్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆమె కూడా స్టోరీ వినగానే సింగిల్ సెట్టింగ్ లో ఒప్పుకున్నట్లు కూడా కథనాలు వెలువడుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక విశ్వంభర సినిమాను UV క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా నిర్మిస్తున్నారు. ఇక సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తూ ఉండగా చోటా కె నాయుడు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చాలాకాలం తర్వాత చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉండడం విశేషం. ఇక విశ్వంభర సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ కు ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.