Begin typing your search above and press return to search.

యానిమాల్ 2.. అప్పుడే హీటేక్కిస్తున్నారుగా..

ట్రైలర్ ముందు వరకు కూడా ఈ సినిమాపై ఒక స్థాయిలో అయితే అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   25 Nov 2023 3:00 AM GMT
యానిమాల్ 2.. అప్పుడే హీటేక్కిస్తున్నారుగా..
X

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అదే కథను బాలీవుడ్ కి తీసుకువెళ్లి అక్కడ కూడా ఊహించని స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు అతని నుంచి రాబోతున్న రెండవ కథ యానిమాల్ కూడా ఏదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉందని అనిపిస్తుంది. ట్రైలర్ ముందు వరకు కూడా ఈ సినిమాపై ఒక స్థాయిలో అయితే అంచనాలు ఉన్నాయి.

కానీ ట్రైలర్ విడుదల తర్వాత మాత్రం ఊహలకందని స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఒక ట్రైలర్ సినిమాపై అంచనాలను క్రియేట్ చేస్తుంది అనడానికి యానిమల్ సినిమా మరొక ఉదాహరణగా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా చిత్ర యూనిట్ చాలా బిజీగా మారిపోయింది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా హీరో రణబీర్ కపూర్ తెలుగులో కూడా పాజిటివ్ గా ప్రమోషన్ చేస్తూ ఉండడం విశేషం.

సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రీసెంట్గా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అనే పాయింట్ ను చెప్పడం విశేషం. నందమూరి బాలకృష్ణ అన్ స్థాపబుల్ షోలో రణబీర్ కపూర్ తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డివంగా హీరోయిన్ రష్మిక మందన్న కూడా పాల్గొన్నారు. అయితే ఈ షోలో బాలకృష్ణ నాతో సినిమా చేయాలని ఉందా అని ఆలోచనను అతనికి కలిగించారు.

మీరు సైలెంట్ గా సెటిల్ గా ఉండే క్యారెక్టర్ లో చూపించాలని ఉంది పైకి మౌనంగా ఉంటూనే లోపల అగ్నిపర్వతం మండేలా ఉండాలి.. ఆ ఆలోచనతో సినిమా చేయాలని ఉంది అని అన్నాడు. మరి ఆ సినిమా ఎప్పుడు చేద్దాం అని బాలయ్య బాబు ప్రశ్నించగా వెంటనే హీరో రణబీర్.. ఇతన్ని కొన్నాళ్లపాటు మాకు వదిలేయండి అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

ఎందుకు ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అని బాలయ్య అడగడంతో దర్శకుడు సందీప్ రెడ్డి అందుకు అవకాశం ఉంది అని కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే యానిమల్ సినిమా విడుదల తర్వాత ఆ విషయంపై క్లారిటీ వస్తుంది అని కూడా అతను వివరణ ఇచ్చాడు. మరి భవిష్యత్తులో నిజంగానే సందీప్ ఈ సినిమాకు సీక్వెల్ తీసుకొస్తాడా లేదా అనేది చూడాలి.